NTV Telugu Site icon

BJP: పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జులను నియమించిన బీజేపీ..

Bjp Icon

Bjp Icon

రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జ్ సహా ఇంఛార్జిలను నియమించింది బీజేపీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జ్‌గా వ్యవహరించిన ప్రకాశ్ జవదేకర్‌ను కేరళ ఇంఛార్జ్‌గా నియమించింది. అండమాన్ నికోబార్‌కు సత్యకుమార్, అరుణాచల్ ప్రదేశ్‌కు ‍‌అశోక్ సింఘాల్, చండీగఢ్‌కు విజయభాయ్ రూపానీ, గోవాకు ఆషిశ్ సూద్, డయ్యూ డామన్‌కు పూర్ణేశ్ మోదీ, హర్యానాకు బిప్లవ్ కుమార్ దేవ్, హిమాచల్ ప్రదేశ్‌కు శ్రీకాంత్ శర్మలను నియమించింది బీజేపీ హైకమాండ్.

HMDA: తవ్వేకొద్దీ బయటపడుతున్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ అక్రమాస్తులు..

అంతేాకాకుండా.. జమ్ము కాశ్మీర్‌, లడ్డక్ ఎన్నికల ఇంఛార్జిగా తరుణ్ చుగ్, ఝార్ఖండ్‌కు లక్ష్మీకాంత్ బాజ్ పేయి, కర్ణాటకకు రాధామోహన్ దాస్ అగర్వాల్, లక్షద్వీప్‌కు అర్వింద్ మీనన్, మధ్యప్రదేశ్‌కు మహేంద్ర కుమార్ సింఘ్ ను నియమించారు. ఒడిశాకు విజయ్ పాల్ సింఘ్ తోమర్, పుదుచ్చేరికి నిర్మల్ కుమార్, పంజాబ్‌కు విజయ్ భాయ్ రూపానీ, సిక్కింకు దిలీప్ జైశ్వాల్, తమిళనాడుకు అరవింద్ మీనన్‌ను, ఉత్తర ప్రదేశ్‌కు వైజయంత్ జై పాండా, ఉత్తరాఖండ్‌కు దుశ్యంత్ కుమార్, వెస్ట్ బెంగాల్‌కు మంగల్ పాండేలను నియమించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పార్లమెంట్ ఎన్నికల సహా ఇంఛార్జిగా పొంగులేటి సుధాకర్ రెడ్డిని నియమించింది బీజేపీ.

Vundavalli Arun Kumar: నేను రాజకీయాల నుంచి వీఆర్‌ఎస్‌ తీసుకున్నా..