Jammu Kashmir: కేంద్రమంత్రి కిషన్రెడ్డితో పాటు ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ను జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జ్లుగా బీజేపీ అధిష్టానం నియమించింది.
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జ్ సహా ఇంఛార్జిలను నియమించింది బీజేపీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జ్గా వ్యవహరించిన ప్రకాశ్ జవదేకర్ను కేరళ ఇంఛార్జ్గా నియమించింది. అండమాన్ నికోబార్కు సత్యకుమార్, అరుణాచల్ ప్రదేశ్కు అశోక్ సింఘాల్, చండీగఢ్కు విజయభాయ్ రూపానీ, గోవాకు ఆషిశ్ సూద్, డయ్యూ డామన్కు పూర్ణేశ్ మోదీ, హర్యానాకు బిప్లవ్ కుమార్ దేవ్, హిమాచల్ ప్రదేశ్కు శ్రీకాంత్ శర్మలను నియమించింది బీజేపీ హైకమాండ్.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే.. కాగా, లోక్ సభ ఎన్నికలపై పార్టీ ఫోకస్ పెట్టింది. తెలంగాణలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలువాలని చూస్తోంది. ఈ క్రమంలో.. పార్టీ ముఖ్య నేతలు తీవ్రంగా పాటుపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ మంత్రులు కొందరు ఢిల్లీకి వెళ్లారు. కాసేపట్లో లోక్ సభ ఎన్నికల సన్నద్ధత సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ కానున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాక.. లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి బాధ్యతలు అప్పజెప్పింది. ఇంఛార్జీలుగా నియమించిన వారిలో ముఖ్యమంత్రితో పాటు అందరూ మంత్రులే ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండు నియోజకవర్గాలకు ఇంఛార్జీలుగా ఉన్నారు. Read Also: Ap Jobs 2023…