Pinarayi Vijayan: తగిన గుణపాఠం చెప్పారు.. కర్ణాటక ఎన్నికలపై కేరళ సీఎం కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Chief Minister Pinarayi Vijayan: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు దేశానికి సానుకూల భవిష్యత్తును తెలియజేస్తున్నాయని, ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ బీజేపీ పాలన లేదని, కర్ణాటక ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని ముఖ్యమంత్రి అన్నారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో 10 రోజుల పాటు ప్రచారం చేసి అరడజను రోడ్ షోలు నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎంత తహతహలాడిందో దీన్నిబట్టి తెలుస్తోంది. ప్రజలు కూడా ఎన్నికలను సీరియస్గా తీసుకున్నారు.’ అని పినరయి విజయన్ అన్నారు.
Read Also: Bandi Sanjay : హిందుత్వం లేకుండా భారతదేశం లేదు
Also Read
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
భారత ఎన్నికల సంఘం ప్రకారం.. కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కర్ణాటకలో 66 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. జనతాదళ్-సెక్యులర్ (జేడీఎస్) 19 స్థానాలను కైవసం చేసుకుంది.కాంగ్రెస్ గతం నుంచి నేర్చుకోవాలి. బీజేపీ ప్రతిపక్షంలో ఉండి సంతృప్తి చెందదు. ఎన్నికల్లో ఓడిపోయినా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నించింది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ప్రయత్నానికి మద్దతిచ్చారని.. మళ్లీ పునరావృతం కాకుండా కాంగ్రెస్ అధినాయకత్వం జాగ్రత్త వహించాలని కేరళ సీఎం సూచించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకూడదనే భావన దేశంలో నెలకొందని అన్నారు. పార్లమెంట్లో సంపూర్ణ మెజారిటీతో దేశాన్ని పాలించినప్పుడు కాంగ్రెస్ గతంలో ఉండేది కాదని ప్రస్తావిస్తూ.. ‘‘దేశాన్ని కాంగ్రెస్ సుదీర్ఘకాలం ఒంటరిగా పాలించింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అలా లేవు. బీజేపీని అధికారం నుంచి దింపడమే లక్ష్యం.. అందులో కాంగ్రెస్ కూడా పాలుపంచుకోవాలి. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశానికి తీరని లోటు అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!