Prajwal Revanna : 100 కోట్ల ఆఫర్… రేవణ్ణ కేసులో డీకే శివకుమార్పై బీజేపీ ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prajwal Revanna : ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతరకర వీడియో కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పై బీజేపీ పెద్ద ఆరోపణ చేశారు. బిజెపి నాయకుడు రేవణ్ణ అభ్యంతరకర వీడియోతో కూడిన పెన్ డ్రైవ్ సర్క్యులేషన్లో డీకే శివకుమార్ తో పాటు మరో నలుగురు మంత్రుల ప్రమేయం కూడా ఉందని దేవరాజేగౌడ తెలిపారు. బీజేపీని, ప్రధాని మోడీ, హెచ్డీ దేవెగౌడ పరువు తీసేందుకు ప్రయత్నించారని దేవ్రాజ్ అన్నారు. కుమారస్వామి ప్రతిష్టను దిగజార్చేందుకు నాకు రూ.100 కోట్లు ఆఫర్ చేశారు. దేవరాజ్ గౌడ లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు. ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు.
రూ.100 కోట్లు ఆఫర్ చేశారు
దేవరాజేగౌడ పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగిసింది. అనంతరం జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా దేవరాజ్గౌడ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెన్ డ్రైవ్ కేసులో డీకే శివకుమార్ హస్తం ఉందని, నలుగురు మంత్రులు ఎన్. చలువరాయస్వామి, కృష్ణ బైరేగౌడ, ప్రియాంక్ ఖర్గే, మరో మంత్రితో కూడిన టీమ్ను ఏర్పాటు చేశారు. బీజేపీని, ప్రధాని మోడీని, కుమారస్వామిని పరువు తీసేందుకే ఇలా చేశారన్నారు. నాకు రూ.100 కోట్లు ఆఫర్ చేశారని తెలిపారు.
Also Read
- Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
- Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
- Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే 'ఫ్లఫీ ఆమ్లెట్' చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
Read Also:Swati Maliwal: సీసీటీవీ ఫుటేజీలను ట్యాంపరింగ్ చేస్తున్నారు
మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అతడు దేశం నుంచి పరారీలో ఉన్నాడు. అతడిని భారత్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై దర్యాప్తు చేసేందుకు సిట్ను ఏర్పాటు చేసింది. రేవణ్ణకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు బయటకు రావడంతో జేడీఎస్ ప్రజ్వల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రేవణ్ణపై అత్యాచారం, లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపులతోపాటు అనేక కేసులు ఉన్నాయి. విషయం తెలియగానే రేవణ్ణ ఏప్రిల్ 27న జర్మనీకి పారిపోయారు. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశారు. ఏప్రిల్ 26న ఎన్నికలు జరిగిన హాసన్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ-జేడీ(ఎస్) కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేశారు.
రేవణ్ణ తండ్రికి మే 20 వరకు మధ్యంతర బెయిల్
హెచ్డీ రేవణ్ణ, ఆయన కుమారుడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఏప్రిల్ 28న హోలెనర్సీపూర్ టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళలపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 47 ఏళ్ల ఇంటి పనిమనిషి తండ్రీ కొడుకులపై ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే నివాసంలో తండ్రీకొడుకులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. విషయం బయటకు పొక్కడంతో ప్రజ్వల్ జర్మనీకి పారిపోయాడు. బెంగళూరులోని ఏసీఎంఎం కోర్టు గురువారం ప్రజ్వల్ తండ్రి మధ్యంతర బెయిల్ను మే 20 వరకు పొడిగించింది.
తాజావార్తలు
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
-
Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!