Kerala: వయనాడ్లో రాహుల్ గాంధీ ప్రత్యర్థిపై 242 క్రిమినల్ కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళ బీజేపీ అధ్యక్షుడు, వయనాడ్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న కే సురేంద్రన్పై ఏకంగా 242 క్రిమినల్ కేసులు నమోదైనట్టు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. తనపై ఉన్న కేసులను సురేంద్రన్ పత్రికా ప్రకటన ద్వారా తాజాగా తెలియజేశారు. సురేంద్రన్తో పాటు ఎర్నాకుళం నుంచి పోటీ చేస్తున్న మరో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కేఎస్ రాధాక్రిష్ణన్ పైనా కూడా 211 కేసులు ఉన్నట్టు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, వీరిపై నమోదైన కేసుల్లో ఎక్కువగా 2018లో చేపట్టిన శబరిమల నిరసనలకు సంబంధించినవే ఉన్నాయి.
Read Also: Vijay Picture Fan Blood: ‘అరేయ్ మెంట్’.. అభిమానికి విజయ్ దేవరకొండ స్వీట్ వార్నింగ్..!
Also Read
ఇక, ఈ కేసులన్నీ కోర్టులో విచారణ దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. పార్టీ లీడర్లు సమ్మె లేదా ఆందోళనలకు పిలుపునిచ్చినప్పుడు.. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఈ కేసులు అలా నమోదు అయినవే అని కేరళ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జార్జ్ కురియన్ తెలిపారు. ఇదే అంశంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సైతం ట్విట్టర్ (‘ఎక్స్’) వేదికగా చెప్పారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జాతీయవాదిగా ఉండటం చాలా కష్టం అన్నారు. అలా ఉండటం రోజు వారీ పోరాటంతో సమానం అని చెప్పుకొచ్చారు. కానీ, ఆ పోరాటం ఎంతో విలువైంది.. ఒక్క వ్యక్తి.. వందలాది కేసులు అంటూ పేర్కొంటూ సురేంద్రన్ను బీఎల్ సంతోష్ ట్యాగ్ చేశారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..