Bird Flu : నల్గొండలో బర్డ్ఫ్లూ..? 7 వేల కోళ్లు పాతిపెట్టిన వైనం..
- నల్గొండలో బర్డ్ఫ్లూ కలకలం
- 7,000 కోళ్లు మృతి.. బర్డ్ ఫ్లూ అనుమానాలు
- 7వేల కోళ్లను పాతిపెట్టిన రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bird Flu : నల్గొండ జిల్లా కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫారంలో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో బర్డ్ ఫ్లూ భయాందోళనకు గురి చేసింది. గ్రామంలోని రైతులు తాము నష్టపోయిన విషయాన్ని తెలియజేస్తూ, ప్రభుత్వ సహాయం కోరుతున్నారు.
చెరుకుపల్లి గ్రామంలోని పౌల్ట్రీ ఫారంలో గత కొన్ని రోజులుగా కోళ్లు అనారోగ్యానికి గురవుతుండగా, ఈ సమస్య మరింత తీవ్రమై సుమారు 7,000 కోళ్లు ఆకస్మికంగా మరణించాయి. ఈ ఘటనతో గ్రామస్తుల మధ్య భయాందోళనలు వ్యక్తమయ్యాయి. బర్డ్ ఫ్లూ సోకినట్టుగా అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో, రైతులు తక్షణమే స్పందించి, చనిపోయిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టారు.
Also Read
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
కోళ్లు అనారోగ్యానికి గురవుతున్న విషయాన్ని గమనించిన వెంటనే రైతులు హైదరాబాద్ నుంచి నిపుణులైన వెటర్నరీ డాక్టర్లను రప్పించారు. అయితే, పలు మార్లు వైద్యం అందించినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించలేదు. రైతులు తమ కోళ్లను రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ, అనారోగ్యం మరింత తీవ్రమై కోళ్ల మరణాన్ని తలపెట్టింది.
Vizag: భర్త షికారుకి తీసుకెళ్లలేదని ఇల్లాలు అలక.. క్షణికావేశంలో ఆత్మహత్య
ఈ సంఘటన వల్ల రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారు. తాము దాదాపు ₹3 లక్షలు నష్టపోయామని పేర్కొంటూ, కోళ్లను ఎంతో శ్రద్ధగా పెంచుకున్నా, ఇలాంటి విపత్తు తమ జీవితాన్ని కల్లోలం చేసిందని వాపోతున్నారు. “హైదరాబాద్ జోనల్ వెటర్నరీ డాక్టర్లు పలు మార్లు వచ్చి వైద్యం అందించినా, అసలు కారణాన్ని చెప్పలేకపోయారు” అని బాధిత రైతులు తెలిపారు.
ఈ అనూహ్య ఘటనతో తమ జీవనోపాధి అస్తవ్యస్తమైనట్లు పేర్కొంటూ, రైతులు ప్రభుత్వం, పౌల్ట్రీ కంపెనీలు, ప్రీమియం సంస్థలు తమకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాము పడిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూస్తున్నామని, తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.
GHMC : ఆస్తిపన్ను బకాయిల్లో షాకింగ్ విషయాలు.. టాప్ టెన్ బకాయి విలువ 203 కోట్లు
తాజావార్తలు
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!