Bird Flu : నల్గొండలో బర్డ్ఫ్లూ..? 7 వేల కోళ్లు పాతిపెట్టిన వైనం..
- నల్గొండలో బర్డ్ఫ్లూ కలకలం
- 7,000 కోళ్లు మృతి.. బర్డ్ ఫ్లూ అనుమానాలు
- 7వేల కోళ్లను పాతిపెట్టిన రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bird Flu : నల్గొండ జిల్లా కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫారంలో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో బర్డ్ ఫ్లూ భయాందోళనకు గురి చేసింది. గ్రామంలోని రైతులు తాము నష్టపోయిన విషయాన్ని తెలియజేస్తూ, ప్రభుత్వ సహాయం కోరుతున్నారు.
చెరుకుపల్లి గ్రామంలోని పౌల్ట్రీ ఫారంలో గత కొన్ని రోజులుగా కోళ్లు అనారోగ్యానికి గురవుతుండగా, ఈ సమస్య మరింత తీవ్రమై సుమారు 7,000 కోళ్లు ఆకస్మికంగా మరణించాయి. ఈ ఘటనతో గ్రామస్తుల మధ్య భయాందోళనలు వ్యక్తమయ్యాయి. బర్డ్ ఫ్లూ సోకినట్టుగా అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో, రైతులు తక్షణమే స్పందించి, చనిపోయిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టారు.
Also Read
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
కోళ్లు అనారోగ్యానికి గురవుతున్న విషయాన్ని గమనించిన వెంటనే రైతులు హైదరాబాద్ నుంచి నిపుణులైన వెటర్నరీ డాక్టర్లను రప్పించారు. అయితే, పలు మార్లు వైద్యం అందించినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించలేదు. రైతులు తమ కోళ్లను రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ, అనారోగ్యం మరింత తీవ్రమై కోళ్ల మరణాన్ని తలపెట్టింది.
Vizag: భర్త షికారుకి తీసుకెళ్లలేదని ఇల్లాలు అలక.. క్షణికావేశంలో ఆత్మహత్య
ఈ సంఘటన వల్ల రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారు. తాము దాదాపు ₹3 లక్షలు నష్టపోయామని పేర్కొంటూ, కోళ్లను ఎంతో శ్రద్ధగా పెంచుకున్నా, ఇలాంటి విపత్తు తమ జీవితాన్ని కల్లోలం చేసిందని వాపోతున్నారు. “హైదరాబాద్ జోనల్ వెటర్నరీ డాక్టర్లు పలు మార్లు వచ్చి వైద్యం అందించినా, అసలు కారణాన్ని చెప్పలేకపోయారు” అని బాధిత రైతులు తెలిపారు.
ఈ అనూహ్య ఘటనతో తమ జీవనోపాధి అస్తవ్యస్తమైనట్లు పేర్కొంటూ, రైతులు ప్రభుత్వం, పౌల్ట్రీ కంపెనీలు, ప్రీమియం సంస్థలు తమకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాము పడిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూస్తున్నామని, తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.
GHMC : ఆస్తిపన్ను బకాయిల్లో షాకింగ్ విషయాలు.. టాప్ టెన్ బకాయి విలువ 203 కోట్లు
తాజావార్తలు
-
Sing Geetham Review : సింగ్ గీతం రివ్యూ.. సింగీతం ప్రయోగం ఎలా ఉందంటే?
-
SPIRIT : ప్రభాస్ కోసం అసలు సిసలైన డ్యూటీ చేస్తున్న సందీప్ రెడ్డి
-
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..