Bihar : విషాదం.. పిడుగుపాటుకు ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar : బీహార్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. రోహ్తాస్లో పిడుగుపడి ఐదుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు పెద్దాస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన బిక్రంగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోత్పా గ్రామంలో చోటుచేసుకుంది. మృతుల్లో ఓ యువకుడు కూడా ఉన్నాడు.
Read Also:Delhi : ఢిల్లీలో తుఫాను, వర్షం విధ్వంసం.. ముగ్గురు మృతి, 23 మందికి గాయాలు
Also Read
బలమైన ఉరుములతో కూడిన గాలి , వర్షం మధ్య పిడుగుపాటు కారణంగా రోహ్తాస్ జిల్లాలో వివిధ ప్రదేశాలలో ఐదుగురు మరణించినట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. మొదటి సంఘటన బిక్రంగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోత్పా గ్రామంలో వర్షం నుండి తమను తాము రక్షించుకోవడానికి చెట్టుకింద నిలుచున్న ఐదుగురిలో ఇద్దరు మరణించారు. మృతులను అరవింద్ కుమార్, ఓంప్రకాష్లుగా గుర్తించారు. రెండవ సంఘటన ఘోసియన్ కాలా, ఇక్కడ రహదారి నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికుడు సునీల్ కుమార్ మరణించగా, సూర్యాపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని మత్గోథాని గ్రామంలో ఆడుకుంటున్న యువకుడు ఆకాష్ గిరి మరణించాడు. బెన్సాగర్కు చెందిన వినయ్ చౌదరి కూడా దినారా పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజ్భదసర రోడ్ కాలువపై పడి మరణించాడు.
Read Also:KKR vs MI: ముంబై ఘోర పరాభవం.. ప్లేఆఫ్స్ చేరిన కోల్కతా..
ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉన్నత కేంద్రానికి తరలించారు. వీరిలో ఇద్దరు బిక్రంగంజ్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రోహ్తాస్ జిల్లాలోని బిక్రమ్గంజ్, సూర్యపుర, దినారా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన తరువాత, పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. బిక్రమ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోత్పాలో ఇద్దరు మృతి చెందగా, మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం సదర్ ఆసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!