Bihar Elections 2025: బీహార్లో హత్యా రాజకీయాలు.. ఎన్నికల ప్రచారంలో తూటాకు బలైన నాయకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో హత్యా రాజకీయాలు కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఒక నాయకుడు తూటాకు బలైన ఘటన గురువారం పాట్నా జిల్లాలోని మోకామా తాల్ ప్రాంతంలో వెలుగు చూసింది. జన్సురాజ్ అభ్యర్థి పియూష్ ప్రియదర్శి మద్దతుదారుడు ఆర్జేడీ మాజీ నాయకుడు దులార్చంద్ యాదవ్ గురువారం రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ కాల్పుల్లో కాల్చి చంపబడ్డాడు. దులార్చంద్ యాదవ్ పియూష్ ప్రియదర్శికి మద్దతుగా తన మద్దతుదారులతో ప్రచారం చేస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం.
READ ALSO: Baahubali Epic: దేశమంతా ఎదురుచూసే బాహుబలిని అక్కడే చూస్తున్న జక్కన్న..
Also Read
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
- Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
- Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..
- Central Cabinet Decisions: దక్షిణాదిలో కీలక రైలు మార్గానికి గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే..!
స్థానికుల సమాచారం ప్రకారం.. మోకామా తాల్లోని ఒక గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పరిస్థితి త్వరగా తీవ్రమై, కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల్లో దులార్చంద్ యాదవ్ ఛాతీ నుంచి తూటాలు దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. తుపాకీ పేలుళ్ల మోతతో ఆ ప్రాంతం భయాందోళనకు గురైంది, వెంటనే ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీయడం ప్రారంభించారు. పియూష్ ప్రియదర్శి దులార్చంద్ యాదవ్ బంధువు అని సమాచారం.
వాస్తవానికి మోకామా తాల్ ప్రాంతం రాజకీయంగా సున్నితమైనదిగా చెబుతుంటారు. ఇక్కడ రాజకీయాలు – నేరాలకు మంచి సంబంధాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దులార్చంద్ యాదవ్ హత్య ఈ ప్రాంతంలో భద్రత, ఎన్నికల వాతావరణం గురించి మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. పోలీసులు సంఘటనా స్థలం నుంచి కొన్ని షెల్ కేసింగ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ASP మాట్లాడుతూ.. ప్రాథమికంగా ఈ కేసు వ్యక్తిగత ఘర్షణగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పాత శత్రుత్వం లేదా రాజకీయ ఆధిపత్యం కారణంగా ప్రచారం సమయంలో ఈ వివాదం తలెత్తి ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు.
దులార్చంద్ యాదవ్ ఎవరు?
మోకామా తాల్ ప్రాంతానికి దులార్చంద్ యాదవ్ పేరు కొత్తేమీ కాదు. ఆయన లాలూ ప్రసాద్ యాదవ్కు చాలా సన్నిహితుడిగా గుర్తింపు ఉంది. ఆయన ఒకప్పుడు చురుకైన RJD కార్యకర్తగా ఉండేవారు. 1990లలో లాలూ యాదవ్ అధికారంలో ఉన్న సమయంలో, ఈ ప్రాంతంలో దులార్చంద్ యాదవ్ ప్రభావం బలంగా ఉండేదని చెబుతున్నారు. ఆయనను RJD అట్టడుగు స్థాయి క్యాడర్ వ్యవస్థాపకులలో ఒకరిగా పరిగణిస్తారు. అలాగే ఆయనకు స్థానిక సామాజిక అనుచరుల గణం కూడా గణనీయంగా ఉంది. ఇటీవలి సంవత్సరాలలో ఆయన జన్సురాజ్ ఉద్యమానికి మద్దతు ఇచ్చి మోకామా స్థానం నుంచి పోటీ చేస్తున్న పియూష్ ప్రియదర్శికి దగ్గరయ్యారు.
తాజావార్తలు
-
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
-
Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
-
Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..
-
Central Cabinet Decisions: దక్షిణాదిలో కీలక రైలు మార్గానికి గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే..!
-
Chennai Love Story: ప్రీమియర్స్ తో 3 కోట్లు కొల్లగొట్టిన చెన్నై లవ్ స్టోరీ
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!