WTC 2025 Final: టీమిండియాకు బిగ్ షాక్.. అగ్రస్థానానికి దక్షిణాఫ్రికా జట్టు
- శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 109 పరుగుల తేడాతో విజయం
- 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0తో కైవసం చేసుకున్న సౌతాఫ్రికా
- డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన దక్షిణాఫ్రికా
- రెండో స్థానంలో ఆస్ట్రేలియా, మూడో స్థానంలో కొనసాగుతున్న భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 109 పరుగుల తేడాతో విజయం సాధించి 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో చాలా లాభపడింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకుంది.
దక్షిణాఫ్రికా 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది:
అడిలైడ్లో భారత జట్టును ఓడించిన ఆస్ట్రేలియా WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే కంగారూ జట్టు ఈ ప్రస్థానం ఎంతో సమయం ఉండలేదు. మరుసటి రోజు దక్షిణాఫ్రికా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుత సైకిల్లో దక్షిణాఫ్రికా 10 మ్యాచ్లలో 6 గెలిచింది. 3 ఓడిపోగా, ఒక మ్యాచ్ డ్రాగా నిలిచింది. దక్షిణాఫ్రికా 76 పాయింట్లు ఉండగా.. పాయింట్ల శాతం 63.330గా ఉంది.
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
Read Also: BCCI: బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవ్జిత్ సైకియా నియామకం..
టీమిండియా మూడో స్థానానికి చేరుకుంది:
2023-25 సైకిల్లో ఆస్ట్రేలియా 14 మ్యాచ్లలో 9 గెలిచింది.. 4 ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. కంగారూ జట్టు 102 పాయింట్లు ఉండగా.. పాయింట్ల శాతం 60.710గా ఉంది. అడిలైడ్లో ఓటమి తర్వాత భారత జట్టు మూడో స్థానానికి పడిపోయింది. ఈ సైకిల్లో టీమిండియా 16 మ్యాచ్లు ఆడి 9 విజయాలు సాధించింది. భారత్ 6 ఓడిపోగా.. ఒక మ్యాచ్ డ్రా అయింది. భారత జట్టుకు 110 పాయింట్లు ఉండగా.. పాయింట్ల శాతం 57.290 ఉంది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాల్సి వస్తే.. ఎట్టిపరిస్థితుల్లోనూ టాప్-2లో నిలవాల్సిందే. అందుకోసం.. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతోంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. పెర్త్ టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో గెలుపొందగా.. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ ఫైనల్ ఆడాలంటే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 4-1 లేదా 3-1 తేడాతో గెలవాలి.
WTC ఫైనల్కు భారత్ వెళ్లాలంటే..?
టీమిండియా BGTని 3-2తో గెలిస్తే.. ఫైనల్ ఆడేందుకు శ్రీలంకపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇందుకోసం శ్రీలంక 1 లేదా 2 టెస్టుల్లో ఆస్ట్రేలియాను ఓడించాల్సి ఉంటుంది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ 2-2తో సమంగా ఉంటే శ్రీలంక 2-0తో ఆస్ట్రేలియాను ఓడించాల్సి ఉంటుంది.
ఒకవేళ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 2-3 తేడాతో ఓడిపోతే ఫైనల్ ఆడాలంటే రెండు జట్లపైనే ఆధారపడాల్సి ఉంటుంది.
ఈ పరిస్థితిలో పాకిస్థాన్ 2-0తో దక్షిణాఫ్రికాను ఓడించాల్సి ఉంటుంది. అదేవిధంగా తొలి టెస్టులో శ్రీలంకను ఆస్ట్రేలియా ఓడించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!