Ahmedabad Plane Crash: ఆలస్యం, ప్రయాణ వాయిదా.. విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న ఇద్దరు!
- అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం
- టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం
- విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న ఇద్దరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురువారం మధ్యాహ్నం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం (ఏఐ171) కుప్పకూలడంతో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మృతి చెందారు. విమానం ఉన్న ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం భవనంపై కుప్పకూలడంతో 24 మంది మెడికోలు కూడా చనిపోయారు. ఎయిరిండియా విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చగా.. ఇద్దరు మాత్రం తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.
పది నిమిషాల ఆలస్యం భూమి చౌహాన్ అనే యువతి ప్రాణాలను నిలబెట్టింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లడానికి ఎయిరిండియా ఫ్లైట్లో ఓ సీటును భూమి చౌహాన్ బుక్ చేసుకున్నారు. విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ఆమె ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. దీంతో భూమి చౌహాన్ పది నిమిషాలు ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకుంది. అప్పటికే ఫ్లైట్ టేకాఫ్ అయి.. కాసేపటికే కుప్పకూలింది. విషయం తెలిసిన ఆమె షాక్కు గురైంది. ‘విమాన ప్రమాదం గురించి తెలియగానే షాక్కు గురయ్యా. ఒళ్లు గగుర్పొడిచే ఘటన గురించి తలుచుకుంటే నా శరీరం వణుకుతోంది. నేను అస్సలు మాట్లాడలేకపోతున్నా. నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఆ గణపతి బప్పే నన్ను కాపాడాడు’ అని భూమి చౌహాన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లండన్లో భర్తతో కలిసి ఉంటున్న భూమి చౌహాన్ రెండేళ్ల అనంతరం ఇండియా వచ్చింది. తిరుగు ప్రయాణంకు టికెట్ బుక్ చేసుకోగా.. ఆలస్యం ఆమె ప్రాణాలను నిలబెట్టింది.
Also Read
- Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే..
- Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? పవన్ ఫైర్
- Pawan Kalyan: బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం..
- Mamata Banerjee: "అప్పటి వరకు నేను చావను".. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
Also Read: AirIndia Plane Crash: కుటుంబం మొత్తాన్ని బలిగొన్న విమాన ప్రమాదం.. లండన్లో స్థిరపడాలని..!
గుజరాత్కు చెందిన 60 ఏళ్ల సవ్జీభాయ్ టింబడియాను అదృష్టం కాపాడింది. లండన్లో నివసిస్తున్న సవ్జీభాయ్ కుమారుడు ఇటీవల ఆయన కోసం ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో టికెట్ బుక్ చేశారు. ఎయిర్ ఇండియా సంస్థ ఆయనకు సీటు నంబరు కూడా కేటాయించింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల నాలుగు రోజుల క్రితమే సవ్జీభాయ్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. అహ్మదాబాద్లో గురువారం విమానం ప్రమాదానికి గురి కాగా.. అదృష్టం కొద్ది ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆ దేవుడి దయతోనే తాను ప్రాణాలతో బయపడ్డాడని సవ్జీభాయ్ తెలిపారు.
తాజావార్తలు
-
Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే..
-
Pawan Kalyan : గద్దరన్న విగ్రహం ఏపీలో పెట్టిస్తా
-
Buchi Babu: మ్యారేజ్ డే రోజు భార్యతో కాకుండా చరణ్ సినిమాతోనే.. ‘పెద్ది’ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ డెడికేషన్!
-
Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? పవన్ ఫైర్
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 3 నోటిఫికేషన్ లు విడుదల చేసిన TGPSC
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!