Bhola Shankar : యమహా నగరి బ్యాక్డ్రాప్ మ్యాజిక్ రిపీట్ చేయబోతున్న చిరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాల్తేరు వీరయ్యతో సక్సెస్ సాధించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. స్టైలిష్ ఫిలింమేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తమిళ చిత్రం వేదాళంకు రీమేక్. తమిళంలో అజిత్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా 2015లో విడుదలై ఘనవిజయం సాధించింది. మళ్లీ 8ఏళ్ల తరవాత తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. ఆయన సరసన తమన్నా హీరోయిన్ పాత్ర పోషిస్తుంది.
https://twitter.com/BholaaShankar/status/1653746881368047616
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
Also Read : Allari naresh: కామెడీ చేసేవాళ్లంటే చిన్న చూపు
ఈ ఏడాది ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా హైదరాబాద్లో యాక్షన్ సీక్వెన్స్ను, ఓ సాంగ్ ను పూర్తిచేసుకున్న చిత్ర బృందం.. కొత్త షెడ్యూల్ కోసం కోల్కతాకు బయలుదేరి వెళ్లింది. ఇవాళ్టి నుంచి యమహా నగరిలో షెడ్యూల్ ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిన ‘చూడాలని వుంది’ కోల్కతా బ్యాక్డ్రాప్లోనే ఉంటుంది. అయితే ఈ సినిమా బాక్స్ ఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు ‘భోళా శంకర్’ సినిమా కూడా అదే కోల్కతా బ్యాక్డ్రాప్లో ఉండబోతోంది అని తెలుస్తుంది. కాబట్టి, ‘చూడాలని వుంది’ మ్యాజిక్ను మెగాస్టార్ చిరంజీవి రిపీట్ చేయబోతున్నారని చిత్ర బృందం అంటుంది.
Also Read : Press Freedom Index: మీడియా స్వేచ్ఛలో మరింత దిగువకు ఇండియా.. ఎన్నో స్థానం అంటే..
ఈ మూవీలో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయ్యింది. హైదరాబాద్లో ఇటీవల షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఇంటర్వెల్ ఎపిసోడ్ అని చిత్రబృందం ప్రకటించింది. ఇప్పుడు మిగిలిన సన్నివేశాలను కోల్కతాలో ఇవాళ్టి నుంచి చిత్రీకరించనున్నారు.
Also Read : Bangladesh: తనను నిరాకరించిందని హిందూ బాలిక దారుణ హత్య..
కోల్కతా షెడ్యూల్లో చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, ఇతర నటీనటులతో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత చిరంజీవి, తమన్నాలపై ఓ పాటను కూడా చిత్రీకరించేందుకు యూరప్ వెళ్లనున్నారు. యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొంత టాకీ పార్ట్, క్లైమాక్స్ షూట్, భారీ సెట్లో సాంగ్ చిత్రీకరిస్తామని నిర్మాణ సంస్థ వెల్లడించింది. జూన్ నెలాఖరుకు మూవీ చిత్రీకరణ పూర్తిచేస్తారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
BharatPe Flex Feature: భారత్పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
-
Astrology: ఈ 4 రాశులవారు కోపం వచ్చినప్పుడు అసలు కంట్రోల్లో ఉండరట.. మీ రాశి కూడా ఉందా?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!