మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ భీమా’. ఈ సినిమాకు ఏ హర్ష దర్శకత్వం వహించారు. కన్నడనాట దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఎ హర్ష భీమా సినిమాతో తెలుగులోకి డెబ్యూ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు.భీమా చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై నిర్మాత కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భీమా సినిమాలో గోపీచంద్ సరసన మాళవిక శర్మ మరియు ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా చేశారు. అయితే భీమాలో గోపీచంద్ రెండు పాత్రలు పోషించినట్లుగా తెలుస్తోంది. వీరితోపాటు సినిమాలో ముఖేష్ తివారి, వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్ మరియు నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.తాజాగా మార్చి 8న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భీమా మూవీ థియేటర్లలో విడుదల అయింది.ఇప్పటికే భీమా సినిమాకు ప్రీమియర్ షోలు వేయగా అవి చూసిన సినీ ప్రేక్షకులు, నెటిజన్స్ భీమాపై పాజిటివ్గా స్పందించారు.
భీమా మూవీ గోపీచంద్కు కమ్ బ్యాక్ హిట్ మూవీగా నిలుస్తుందని చెబుతున్నారు . అంతేకాకుండా భీమా సినిమాలో గోపీచంద్ అదరగొట్టాడని, దాదాపుగా శివతాండవం చేశాడని నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు . చిత్రంలో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని, బీజీఎమ్ బాగుందంటూ రివ్యూస్ ఇస్తున్నారు.ఇదిలా ఉంటే భీమా సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుందని సమాచారం. అలాగే శాటిలైట్ రైట్స్ను బుల్లితెర టీవీ ఛానెల్ స్టార్ మా సొంతం చేసుకుంది. ఓటీటీ అండ్ శాటిలైట్ హక్కులు అన్ని కలిపి మొత్తంగా రూ. 20 కోట్ల వరకు అమ్ముడు పోయినట్లు సమాచారం.అయితే భీమా ఓటీటీ పార్టనర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అని సినిమా ఎండ్ టైటిల్ కార్డ్స్ ద్వారా తెలిసింది. ఇకపోతే ఈ ఓటీటీ డీల్ భీమా మూవీ విడుదల కాకముందే జరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న రూల్ ప్రకారం మూవీ విడుదలైన నెల రోజులకు ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. అంటే భీమా సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ఎప్రిల్ మొదటి వారం, లేదా రెండో వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.