Bhatti Vikramarka : బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 72,659 కోట్లు
- ప్రజా ప్రభుత్వంలో రైతుకు భరోసా
- బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 72,659 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉంది.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తామని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం అయ్యారు. రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై రెండు గంటల పాటు మంత్రులు కసరత్తు చేశారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రైతు భరోసా అందించిన తీరు.. క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన క్రమంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు .. అధికారులు సేకరించిన సమాచారం పైన మంత్రులు కసరత్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు రైతులకు రైతు భరోసా ఇచ్చి తీరుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం అనుబంధ రంగాలకు 72,659 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ ను ఈ అంకెలు తెలియజేస్తాయని డిప్యూటీ సీఎం తెలిపారు. రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ కింద రెండు నెలల వ్యవధిలోనే 21 వేల కోట్ల రూపాయల నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతుల సంక్షేమానికి కృషి చేసేందుకు వ్యవసాయ కమిషన్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్మించిన రైతు వేదికలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. రైతు వేదికలను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టింది, రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ను అనుసంధానం చేసి రైతు సమస్యలను పరిష్కరించేందుకు రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. 110 రైతు వేదికల్లో నాలుగు కోట్ల పైగా నిధులు వెచ్చించి వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా ప్రజా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేసిన విషయాన్ని వివరించారు. 1,57,51000 ఎకరాలకు 7,625 కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏడాది పాటు శ్రమించిన అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికి వస్తుందో రాదో అని భయాలు నిత్యం రైతులను వెంటాడుతున్నాయి, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.
Also Read
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
పంటల బీమా పథకం కింద ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన చెల్లిస్తుందని తెలిపారు. పంటలకే కాదు రైతు కుటుంబానికి భరోసాగా నిలిచేందుకు రైతు బీమా పథకం కింద రైతులకు పక్షాన ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది అన్నారు. 2024-25 లో రాష్ట్రంలో ఒక లక్ష ఎకరాల ఆయిల్ ఫామ్ సాగును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 2023-24 ఏడాదికి గాను ఆయిల్ సాగు పథకం కింద కేంద్ర ప్రభుత్వం 80.10 కోట్లు విడుదల చేయగా రాష్ట్ర వాటా కలుపుకొని మొత్తం 133.5 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే సన్నధాన్యానికి ప్రతి క్వింటాకు 500 రూపాయలు బోనస్ గా చెల్లిస్తుందని తెలిపారు. గత వాన కాలంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జిల్లాల్లో దాన్యం కొనుగోలు సాఫీగా జరిగేందుకు జిల్లాల వారీగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి రఘు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Itel A50: అదిరిపోయే ఫీచర్స్ ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ కేవలం రూ. 6099కే
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!