Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bhatti Vikramarka Farmer Support Measures Telangana

Bhatti Vikramarka : బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 72,659 కోట్లు

Published Date :December 29, 2024 , 4:39 pm
By Gogikar Sai Krishna
  • ప్రజా ప్రభుత్వంలో రైతుకు భరోసా
  • బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 72,659 కోట్లు
Bhatti Vikramarka : బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 72,659 కోట్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉంది.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తామని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం అయ్యారు. రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై రెండు గంటల పాటు మంత్రులు కసరత్తు చేశారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రైతు భరోసా అందించిన తీరు.. క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన క్రమంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు .. అధికారులు సేకరించిన సమాచారం పైన మంత్రులు కసరత్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు రైతులకు రైతు భరోసా ఇచ్చి తీరుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం అనుబంధ రంగాలకు 72,659 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ ను ఈ అంకెలు తెలియజేస్తాయని డిప్యూటీ సీఎం తెలిపారు. రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ కింద రెండు నెలల వ్యవధిలోనే 21 వేల కోట్ల రూపాయల నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతుల సంక్షేమానికి కృషి చేసేందుకు వ్యవసాయ కమిషన్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్మించిన రైతు వేదికలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. రైతు వేదికలను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టింది, రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ను అనుసంధానం చేసి రైతు సమస్యలను పరిష్కరించేందుకు రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. 110 రైతు వేదికల్లో నాలుగు కోట్ల పైగా నిధులు వెచ్చించి వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా ప్రజా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేసిన విషయాన్ని వివరించారు. 1,57,51000 ఎకరాలకు 7,625 కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏడాది పాటు శ్రమించిన అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికి వస్తుందో రాదో అని భయాలు నిత్యం రైతులను వెంటాడుతున్నాయి, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.

పంటల బీమా పథకం కింద ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన చెల్లిస్తుందని తెలిపారు. పంటలకే కాదు రైతు కుటుంబానికి భరోసాగా నిలిచేందుకు రైతు బీమా పథకం కింద రైతులకు పక్షాన ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది అన్నారు. 2024-25 లో రాష్ట్రంలో ఒక లక్ష ఎకరాల ఆయిల్ ఫామ్ సాగును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 2023-24 ఏడాదికి గాను ఆయిల్ సాగు పథకం కింద కేంద్ర ప్రభుత్వం 80.10 కోట్లు విడుదల చేయగా రాష్ట్ర వాటా కలుపుకొని మొత్తం 133.5 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే సన్నధాన్యానికి ప్రతి క్వింటాకు 500 రూపాయలు బోనస్ గా చెల్లిస్తుందని తెలిపారు. గత వాన కాలంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జిల్లాల్లో దాన్యం కొనుగోలు సాఫీగా జరిగేందుకు జిల్లాల వారీగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి రఘు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Itel A50: అదిరిపోయే ఫీచర్స్ ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ కేవలం రూ. 6099కే

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Agriculture Support
  • bhatti vikramarka
  • crop insurance
  • Deputy CM Telangana
  • farmer welfare

తాజావార్తలు

  • Hari Teja: బన్నీ కోసం..15 రోజులు అన్నం మానేశా..

  • H-CITI Project: 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ లు.. సిగ్నల్ ఫ్రీ జంక్షన్ గా మారనున్న కేబిఆర్ పార్క్ జంక్షన్..

  • VFX vs AI: టెక్నాలజీ పెరిగినా తప్పని వివరణలు.. సినిమా మేకర్స్ కి ఏఐ టెన్షన్స్!

  • Vishnu Vinyasam: విష్ణు విన్యాసం లీక్.. బిగ్ మిస్టరీ

  • London: లండన్‌లో ఘోరం.. అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

ట్రెండింగ్‌

  • Ragi Barfi Recipe: రుచితో పాటు పోషకాలు.. హోమ్‌ మేడ్ ‘రాగి బర్ఫీ’ ఎలా చేయాలంటే!

  • TVS Apache RTR 200 vs Bajaj Pulsar NS200: పవర్, స్టైల్, బడ్జెట్.. ఏది బెస్ట్?

  • Cholesterol Control : చెడు కొలెస్ట్రాల్ మాయం.. మీ గుండె పదిలం..! ఈ ఆహారమే మందు..

  • Fatty Liver Diet : వారంలోనే ఫలితం.. ఫ్యాటీ లివర్ తగ్గించే అద్భుతమైన డైట్ ప్లాన్.!

  • Tirumala Package: ప్రయాణం+దర్శనం ఒక్కటే ప్లాన్‌లో.. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రత్యేక బస్సు ప్యాకేజీలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions