Bhatti Vikramarka : వేలాది కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం లోని ధనియాల గూడెం వద్ద భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పారని, అవకతవకల కాళేశ్వరం గురించి ముందే చెప్పానని ఆయన వెల్లడించారు. డిజైన్ బాగా లేదని చెప్పామని ఆయన అన్నారు. కేసీఆర్ ఇంజనీరింగ్ అధికారి గా స్వంతంగా డిజైన్ చేసి కావాల్సిన కాంట్రాక్టర్ లను పిలిపించి కుని రెడిజైనింగ్ చేసిన కేసీఆర్.. తెలంగాణ ప్రజలను మోసం చేశారన్నారు. వేలాది కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని ఆయన విమర్శించారు.
అంతేకాకుండా.. ‘మేడిగడ్డ ప్రాజెక్ట్ దెబ్బతిన్నది. ప్రజలకు ఏమి తెలియకుండా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ మీద ఆరోపణలు చేశారు. మీడియాను వెళ్లనివ్వడం లేదు వాస్తవాలు రానివ్వడం లేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఇచ్చిన రిపోర్ట్ లో డాం కు జరిగిన నష్టం చూపించింది. బ్యారేజికి చెందిన ఎటువంటి సమాచారం కేంద్రానికి డ్యాం అథారిటీ ఇవ్వలేదు. రాజకీయంగా మేము ఆరోపణలు చేయడం లేదు. వాస్తవాలను కేంద్రం లోని డ్యాం సేఫ్టీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్. ప్లానింగ్కు అనుగుణంగా నిర్మాణం జరుగలేదు. డిజైన్ చేసినట్లుగా ప్లానింగ్ జరుగలేదు. మొత్తం బ్యారేజి ప్రమాదంలో పడనుంది. బ్యారేజి లో నీళ్ళు నింపితే ప్రమాదకరం. మేడిగడ్డ, సుందిల్లలు కూడా ప్రమాదం లో వున్నాయి.
Also Read
- August 14 1947 అర్ధ రాత్రి ఏం జరిగింది?.. స్వాతంత్య్ర సంబరాల వెనుక దాగిన విభజన విషాదం..
- కొత్త 'ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే'తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
- Astrology: ఆగస్టు 14 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారు వారు కాస్త జాగ్రత్త..!
కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారింది… కేంద్రం ఎందుకు స్పందించడం లేదు. కేంద్ర పర్యవేక్షణ వైఫల్యం దర్యాప్తు సంస్థలు విచారణ చేయక పోతే కేంద్రం రాష్ట్ర కలసి పోయినట్లుగా భావించారు. బీజేపీ, బీఆర్ఎస్లు రెండు కలసి దోచుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అందరూ చూడడానికి అనుమతి ఇవ్వాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం మాత్రమే. డ్యాం ఎల్అండ్టీ సంస్థ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది… సెంట్రల్ విజిలెన్స్ కూడా బాధ్యత వహించాలి విచారణ చేయాలి. కాంగ్రెస్ చెప్పిన ప్రతి దానిని రాజకీయం అంటున్నారు కానీ నేషనల్ డాం సెక్యూరిటీ ఇప్పుడు చెబుతుంది. దోపిడీ తోనే పని చేసుకుందామని బీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ నివేదిక కాళేశ్వరం డామేజ్ ఇవ్వలేదు.’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Independence Day 2026: మౌల్వీ మహమ్మద్ బాఖిర్… బ్రిటిష్ని గడగడలాడించిన జర్నలిస్ట్!
-
August 14 1947 అర్ధ రాత్రి ఏం జరిగింది?.. స్వాతంత్య్ర సంబరాల వెనుక దాగిన విభజన విషాదం..
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
-
Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మనీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!