Bharath Jodo Yatra : తెలంగాణలో మూడో రోజు ప్రారంభమైన రాహుల్ యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట దేశ వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. నిన్నటితో రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభించి 50 రోజులు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలోనే.. నేడు మూడో రోజు తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. ఎలిగండ్ల నుంచి ప్రారంభమైన రాహుల్ యాత్ర.. మరికల్, పెద్ద చింతకుంట, లాల్ కోట చౌరస్తా, దేవరకద్ర మీదుగా మన్యం కొండ వరకు సాగునుంది. మన్యం కొండ వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ రోజు 23.3 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది.
Also Read : Minister Asks Collector: మద్యం తాగుతావా.. కలెక్టర్ను అడిగిన మంత్రి, మండిపడుతున్న విపక్షాలు
గోప్లాపూర్ శివారులో మధ్యాహ్నం భోజనం విరామం తరువాత తిరిగి మళ్లీ యాత్రలో పాల్గొంటారు. రాత్రికి ధర్మాపూర్ లో రాహుల్ గాంధీ బస చేయనున్నారు. ఇదిలా ఉంటే.. నవంబర్ 1న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ పాదయాత్రలో పాల్గొననున్నారు. ఏఐసీసీగా పదవి చేపట్టిన తరువాత మల్లికార్జున ఖర్గే తొలి పర్యటన కావడం విశేషం. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో రాహుల్ యాత్ర కొనసాగుతుండగానే మల్లికార్జున ఖర్గే ఈ పాదయాత్రలో పాల్గొనాలనుకోవడం గమనార్హం.
Also Read
తాజావార్తలు
-
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన పైపులు..
-
Toxic: టాక్సిక్ అంతా ఇంతేనా?
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. కారణమిదేనా?
-
Chiranjeevi: వయసు 70.. ప్యాషన్ మాత్రం 25.. హ్యాట్సాఫ్ చిరు!
-
Abhishek Sharma: “గర్ల్ఫ్రెండ్” అంటూ ప్రచారం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అభిషేక్ శర్మ.. కట్చేస్తే..
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!