మనుషులు అందంగా ఉండాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. అంతేకాదు వేలకు వేలు ఖర్చు చేస్తారు.. కానీ ప్రయోజనం లేకపోవడంతో నిరాశ పడతారు.. అలాంటి వారు ఇప్పుడు చెప్పే విషయాలను పాటించడం వల్ల చర్మ సౌందర్యాన్ని చాలా సులభంగా మెరుగుపరుచుకోవచ్చు. చర్మం అందంగా కాంతివంతంగా తయారవ్వాలంటే మనం రోజుకు 5 లీటర్ల నీటిని తాగాలి. కాలంతో సంబంధం లేకుండా రోజు తప్పకుండా నీటిని తాగాలి.. ఇలా నీళ్లు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. చర్మం పొడి భారకుండా ఉంటుంది.. ఇక చర్మ సౌందర్యం కోసం కొన్ని రకాల జ్యూస్ లను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జ్యూస్ కు కావలసిన పదార్థాలు :
2 క్యారెట్స్ ,
2 టమాటాలు,
ఒక కీరదోస,
బీట్ రూట్
వీటిని తీసుకొని కడిగి ముక్కలుగా చేసి జార్ లో వేసి జ్యూస్ లా చేసుకోవాలి. తరువాత దీనిని వడకట్టగా వచ్చిన జ్యూస్ లో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవాలి..ఈ జ్యూస్ ను తాగిన అరగంట తరువాత ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే సాయంత్రం 5 గంటల సమయంలో బత్తాయి, ఫైనాఫిల్, కమలా పండ్లతో చేసిన జ్యూస్ లను తీసుకోవాలి. వీటిలో ఏదో ఒక జ్యూస్ ను తీసుకోవాలి.. ఇలా క్రమం తప్పకుండ రోజు తీసుకోవడం వల్ల చర్మం రంగు మారుతుంది..చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. అదే విధంగా ముఖం అందంగా కనబడాలనుకునే వారు రాత్రి భోజనంలో కేవలం పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఈ పండ్లను కూడా సాయంత్రం 7 లోపే తీసుకోవాలి..
వీటిని ఇలా క్రమం తప్పకుండ తీసుకోవడం వల్ల చర్మ సంరక్షణలకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. చర్మకణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా తీసుకోవడం వల్ల మలినాలు, మృత కణాలు చర్మం పై పేరుకుపోకుండా చక్కగా తొలగిపోతాయి. కాలుష్యం, ఎండలో తిరగడం వల్ల రంగు మారిన చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది… రంగు రోజు రోజుకు పెరుగుతుంది.. ఇలా ఐరన్ ఉన్న పండ్లను తీసుకోవడం వల్ల చర్మ రంగు పెరగడంతో పాటు.. జుట్టు కూడా బాగా పెరుగుతుంది.. మీరు కూడా ట్రై చెయ్యండి..