Bengal Assembly: కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగానికి వ్యతిరేకంగా తీర్మానం.. బెంగాల్ అసెంబ్లీ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Assembly: తృణమూల్ కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే మోషన్ను చదివే సమయంలో తమ సభ్యులు అసెంబ్లీకి హాజరుకావడం అవినీతి కేసులకు మద్దతు ఇచ్చినట్లే అవుతుందని పేర్కొంటూ బీజేపీ సభను వాకౌట్ చేసింది. పశ్చిమ బెంగాల్ శాసనసభలో వ్యాపార విధానాలు, ప్రవర్తన నియమాలు 185 కింద సీనియర్ తృణమూల్ తపస్ రాయ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
మంత్రి పార్థ భౌమిక్ను నెల రోజుల్లోగా కటకటాల వెనక్కి నెట్టివేస్తామని ప్రతిపక్ష నేత సువేందు అధికారి చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ, రాజకీయ నేతలను వేధించడం కోసం దేశంలో 2014 నుంచి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని రాయ్ అన్నారు. సువేందు అధికారికి వ్యతిరేకంగా పార్థ భౌమిక్ ప్రివిలేజ్ మోషన్ను సమర్పించారు. “ప్రతిపక్ష నాయకుడు మంత్రులతో సహా రాష్ట్ర అధికార పక్ష సభ్యులను భయంకరమైన పరిణామాలతో ఎలా బెదిరించారో మేము చూశాము” అని రాయ్ అన్నారు. తీర్మానంపై రాష్ట్ర మంత్రి చంద్రిమా భట్టాచార్య మాట్లాడుతూ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఎంపిక చేసి భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని ఆరోపించారు. తృణమూల్పై దుష్ప్రచారం చేయడమే వారి ఉద్దేశ్యమని, బీజేపీ రాజకీయంగా పోరాడలేకనే కేంద్ర ఏజెన్సీలను పార్టీ నేతలపై ప్రయోగిస్తున్నారని ఆమె అన్నారు.
Also Read
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
Read Also: Ankita Bhandari Case: అంకితా భండారీ హత్య కేసు.. దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ను కోరిన సుప్రీం
అనంతరం బీజేపీ చీఫ్ విప్ మనోజ్ తిగ్గ విలేకరులతో మాట్లాడుతూ ఆరోపణలు నిరాధారమైనవన్నారు. “అక్కడ ఉండడం వల్ల టీఎంసీ చెప్పేదానికి మద్దతివ్వడమేనని మేము భావించి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాం, ఇది పచ్చి అబద్ధం తప్ప మరొకటి కాదు” అని ఆయన అన్నారు. కుంభకోణాలు, అవినీతి కేసుల్లో ప్రమేయం ఉన్నారనే ఆరోపణలపై ఇటీవలి కాలంలో పలువురు తృణమూల్ నేతలు, మంత్రులను కేంద్ర అధికారులు అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
-
Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
-
Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..