Bengal Assembly: కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగానికి వ్యతిరేకంగా తీర్మానం.. బెంగాల్ అసెంబ్లీ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Assembly: తృణమూల్ కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే మోషన్ను చదివే సమయంలో తమ సభ్యులు అసెంబ్లీకి హాజరుకావడం అవినీతి కేసులకు మద్దతు ఇచ్చినట్లే అవుతుందని పేర్కొంటూ బీజేపీ సభను వాకౌట్ చేసింది. పశ్చిమ బెంగాల్ శాసనసభలో వ్యాపార విధానాలు, ప్రవర్తన నియమాలు 185 కింద సీనియర్ తృణమూల్ తపస్ రాయ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
మంత్రి పార్థ భౌమిక్ను నెల రోజుల్లోగా కటకటాల వెనక్కి నెట్టివేస్తామని ప్రతిపక్ష నేత సువేందు అధికారి చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ, రాజకీయ నేతలను వేధించడం కోసం దేశంలో 2014 నుంచి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని రాయ్ అన్నారు. సువేందు అధికారికి వ్యతిరేకంగా పార్థ భౌమిక్ ప్రివిలేజ్ మోషన్ను సమర్పించారు. “ప్రతిపక్ష నాయకుడు మంత్రులతో సహా రాష్ట్ర అధికార పక్ష సభ్యులను భయంకరమైన పరిణామాలతో ఎలా బెదిరించారో మేము చూశాము” అని రాయ్ అన్నారు. తీర్మానంపై రాష్ట్ర మంత్రి చంద్రిమా భట్టాచార్య మాట్లాడుతూ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఎంపిక చేసి భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని ఆరోపించారు. తృణమూల్పై దుష్ప్రచారం చేయడమే వారి ఉద్దేశ్యమని, బీజేపీ రాజకీయంగా పోరాడలేకనే కేంద్ర ఏజెన్సీలను పార్టీ నేతలపై ప్రయోగిస్తున్నారని ఆమె అన్నారు.
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
Read Also: Ankita Bhandari Case: అంకితా భండారీ హత్య కేసు.. దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ను కోరిన సుప్రీం
అనంతరం బీజేపీ చీఫ్ విప్ మనోజ్ తిగ్గ విలేకరులతో మాట్లాడుతూ ఆరోపణలు నిరాధారమైనవన్నారు. “అక్కడ ఉండడం వల్ల టీఎంసీ చెప్పేదానికి మద్దతివ్వడమేనని మేము భావించి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాం, ఇది పచ్చి అబద్ధం తప్ప మరొకటి కాదు” అని ఆయన అన్నారు. కుంభకోణాలు, అవినీతి కేసుల్లో ప్రమేయం ఉన్నారనే ఆరోపణలపై ఇటీవలి కాలంలో పలువురు తృణమూల్ నేతలు, మంత్రులను కేంద్ర అధికారులు అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?