Ankita Bhandari Case: అంకితా భండారీ హత్య కేసు.. దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ను కోరిన సుప్రీం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ankita Bhandari Case: ప్రస్తుతం ఉద్వాసనకు గురైన బీజేపీ నాయకుడి కుమారుడికి చెందిన రిషికేశ్లోని రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా పనిచేసిన 19 ఏళ్ల యువతి అంకితా భండారీ హత్యకేసులో జరిపిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ను దాఖలు చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ జర్నలిస్టు, అంకితా భండారీ కుటుంబసభ్యులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం.. స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని డిప్యూటీ అడ్వకేట్ జనరల్ జతీందర్ కుమార్ సేథీని కోరింది. ఇప్పటివరకు జరిగిన విచారణకు సంబంధించి రిపోర్టును దాఖలు చేయాలని ఆదేశించింది.
బాధితురాలు రిషికేశ్ సమీపంలోని వనంతరా రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా పనిచేసింది. రిసార్ట్ను సందర్శించిన వీఐపీకి అదనపు సేవలు అందించమని వారి ఒత్తిడికి లొంగకపోవడంతో దాని యజమాని బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య, అతని ఇద్దరు సహచరులు ఆమెను హత్య చేశారు. భండారీ హత్యకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వినోద్ ఆర్యను బీజేపీ నుంచి బహిష్కరించారు. ఈ కేసులో ఆర్య సహా ముగ్గురు నిందితులు హత్యానేరం ఎదుర్కొంటున్నారు. విచారణ సందర్భంగా, పిటిషనర్ల తరఫు న్యాయవాది దర్యాప్తు జరిగిన తీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్ర పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నాయని పేర్కొన్నారు. ముగ్గురు నిందితులపై ఐపీసీలోని 302 (హత్య), 354ఏ (లైంగిక వేధింపులు), అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం 5(1) సెక్షన్ల కింద అభియోగాలు మోపినప్పటికీ, రాష్ట్ర పోలీసులు కొనసాగిస్తున్న విచారణలో చాలా లోపాలున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు.
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
Read Also: Crime News: ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు అరెస్ట్
ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మృతురాలి కుటుంబ సభ్యులు గత డిసెంబరులో హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం తిరస్కరించింది. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర పోలీసులు కొనసాగిస్తున్న విచారణలో చాలా లోపాలున్నాయని వారు సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ధర్మాసనం ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి పై ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తరాఖండ్ హైకోర్టు 2022 డిసెంబర్ 21న సీబీఐ విచారణకు తమ పిటిషన్ను కొట్టివేసిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ జర్నలిస్టు, మృతుడి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసును ఇప్పటికే సిట్ దర్యాప్తు చేస్తోందని, అనుమానించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషన్లో పేర్కొన్నట్లుగా ఏ వీఐపీకి రక్షణ కల్పించడం లేదని కూడా పేర్కొంది. ఆమె మృతదేహాన్ని వెలికితీసిన రోజే బాధితురాలి గదిని పగలగొట్టారని, మహిళా వైద్యురాలు లేకుండానే పోస్టుమార్టం చేశారని హైకోర్టులో పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజల ఆగ్రహం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం రిసార్ట్ను కూల్చివేయాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!