Belgium: వివాదాస్పద అణు రియాక్టర్ను మూసివేయనున్న బెల్జియం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Belgium: బెల్జియం వివాదాస్పద అణు రియాక్టర్ను మూసివేయనుంది. బెల్జియం అణు శక్తి నుంచి మొత్తం నిష్క్రమణను ఆలస్యం చేసినప్పటికీ, పొరుగున ఉన్న జర్మనీతో వివాదానికి కారణమైన వృద్ధాప్య అణు రియాక్టర్ను మూసివేసేందుకు సిద్ధమైంది. అణుశక్తి నుంచి బయటపడేందుకు రెండు దశాబ్దాల నాటి ప్రణాళికలో భాగంగా గత నాలుగు నెలలుగా టిహంగే-2 రియాక్టర్ను ఆఫ్లైన్లో ఉంచింది. 40 ఏళ్ల వృద్ధాప్య రియాక్టర్లో పగుళ్లు కనుగొనబడిన తర్వాత భద్రతా సమస్యల నేపథ్యంలో మూసివేయాలని జర్మన్ అధికారులు పిలుపునిచ్చారు. బెల్జియం ఆ అభ్యర్థనను తిరస్కరించింది. కానీ చివరకు దీర్ఘకాలిక ప్రణాళికలలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి న్యూక్లియర్ రియాక్టర్ ఆఫ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్ను మూసివేయడంతో రెండు దేశాల్లో భద్రత గణనీయంగా పెరుగుతుందని అని జర్మనీ పర్యావరణ మంత్రి స్టెఫీ లెమ్కే స్థానిక మీడియాకు తెలిపారు.
Pakistan: పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. 100కు చేరిన మృతుల సంఖ్య
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
రియాక్టర్ జర్మనీతో బెల్జియం సరిహద్దు నుండి కేవలం 50 కిలోమీటర్ల (30 మైళ్ళు) దూరంలో ఉంది.2003 నుండి బెల్జియన్ చట్టంలో అణుశక్తిని క్రమంగా తొలగించే ప్రతిపాదన చేయబడింది. కానీ ఉక్రెయిన్పై రష్యా చేసిన యుద్ధం కారణంగా అధిక ఇంధన ధరల నేపథ్యంలో 2025లో దాని ప్రణాళికాబద్ధమైన నిష్క్రమణను దశాబ్దం పాటు ఆలస్యం చేయాలని దేశం గత సంవత్సరం నిర్ణయించుకుంది.సెప్టెంబరులో ఆంట్వెర్ప్ సమీపంలోని డోయెల్ ప్లాంట్ను మూసివేశారు.మొత్తం అణు విద్యుత్ తాత్కాలిక నిషేధాన్ని ఆలస్యం చేయాలనే నిర్ణయాన్ని పాలక కూటమిలో ఉన్న బెల్జియం గ్రీన్ పార్టీ తీవ్రంగా ప్రతిఘటించింది. బెల్జియం జనవరిలో ఫ్రెంచ్ ఇంధన సంస్థ ఎంజీతో తన మరో రెండు రియాక్టర్ల జీవితాన్ని ఒక దశాబ్దం పాటు పొడిగించేందుకు ఒక ఒప్పందాన్ని ప్రకటించింది. బెల్జియం రియాక్టర్ల నుంచి వచ్చే విద్యుత్పైనే సగం ఆధారపడింది.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!