Man Kills Mother: తల్లిని దారుణంగా చంపి.. ముక్కలు చేసి ఫ్రిడ్జిలో పెట్టి కాలువలో పడేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Mother: బెల్జియంలో 30 ఏళ్ల వ్యక్తి తన తల్లిని అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తల్లి శరీరాన్ని ముక్కలుగా నరికి భాగాలను ఫ్రిడ్జిలో పెట్టి ఓ కాలువలో పడేశాడు. గుర్తుతెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి ఈ హత్య గురించి చెప్పాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. ఆ ప్రాంతానికి వెళ్లినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. మద్యం మత్తులో ఉండి ఆ వ్యక్తి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు భావించారు. హత్య, ఛిద్రం చేయడం, శరీర భాగాలను రిఫ్రిజిరేటర్లో భద్రపరచడం గురించి తెలుసుకున్నట్లు కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్నాడు. తర్వాత పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించడంతో రిఫ్రిజిరేటర్లో మహిళ శరీర భాగాలు కనిపించాయి.
Also Read: Yamudu: భూమిపైకి ‘యముడు’.. నరకంలో శిక్షలు ఇక్కడే అమలు పరిస్తే?
Also Read
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
రిఫ్రిజిరేటర్లో రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తదనంతరం వారు బాధితురాలి మొండెం, తలను మరొక కంటైనర్లో కనుగొన్నారు. ఆ మహిళ గోళ్లు, జ్యువెల్లరీ, టాటూల ఆధారంగా ఆచూకీని కనిపెట్టారు. అప్పటికే నిందితుడు అప్రమత్తమై దక్షిణ కొరియాకు పారిపోవాలని పథకం వేశాడు. కానీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తానే తన తల్లిని హత్య చేసినట్టు అంగీకరించాడు. ప్రాథమిక వివరాల ప్రకారం ఈ హత్య జులై 10న జరిగింది. తానే తన తల్లిని చంపేసి శరీరాన్ని ముక్కలు చేసి కాల్వలో పడేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. చాలా రోజులుగా తల్లి, కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయని విచారణలో తేలింది. మాటమాటా పెరిగి కోపంతో తల్లిని చంపేశాడు కొడుకు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
బాధితురాలు తన ఇద్దరు పిల్లలు, మనవరాలితో నివసించే లీజ్ ప్రాంతంలోని సెరాయింగ్లో ఈ సంఘటన జరిగింది. కొవిడ్ -19 మహమ్మారి తర్వాత కొడుకు తనతో కలిసి జీవించడానికి తిరిగి వచ్చినప్పటి నుండి తల్లి, కొడుకు తరచూ వాగ్వాదానికి దిగుతున్నట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!