Man Kills Mother: తల్లిని దారుణంగా చంపి.. ముక్కలు చేసి ఫ్రిడ్జిలో పెట్టి కాలువలో పడేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Mother: బెల్జియంలో 30 ఏళ్ల వ్యక్తి తన తల్లిని అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తల్లి శరీరాన్ని ముక్కలుగా నరికి భాగాలను ఫ్రిడ్జిలో పెట్టి ఓ కాలువలో పడేశాడు. గుర్తుతెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి ఈ హత్య గురించి చెప్పాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. ఆ ప్రాంతానికి వెళ్లినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. మద్యం మత్తులో ఉండి ఆ వ్యక్తి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు భావించారు. హత్య, ఛిద్రం చేయడం, శరీర భాగాలను రిఫ్రిజిరేటర్లో భద్రపరచడం గురించి తెలుసుకున్నట్లు కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్నాడు. తర్వాత పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించడంతో రిఫ్రిజిరేటర్లో మహిళ శరీర భాగాలు కనిపించాయి.
Also Read: Yamudu: భూమిపైకి ‘యముడు’.. నరకంలో శిక్షలు ఇక్కడే అమలు పరిస్తే?
Also Read
- Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
- Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ 'మావిగన్ వర్సెస్ అమరావతి'.. వైఎస్ జగన్ సవాల్..
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
రిఫ్రిజిరేటర్లో రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తదనంతరం వారు బాధితురాలి మొండెం, తలను మరొక కంటైనర్లో కనుగొన్నారు. ఆ మహిళ గోళ్లు, జ్యువెల్లరీ, టాటూల ఆధారంగా ఆచూకీని కనిపెట్టారు. అప్పటికే నిందితుడు అప్రమత్తమై దక్షిణ కొరియాకు పారిపోవాలని పథకం వేశాడు. కానీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తానే తన తల్లిని హత్య చేసినట్టు అంగీకరించాడు. ప్రాథమిక వివరాల ప్రకారం ఈ హత్య జులై 10న జరిగింది. తానే తన తల్లిని చంపేసి శరీరాన్ని ముక్కలు చేసి కాల్వలో పడేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. చాలా రోజులుగా తల్లి, కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయని విచారణలో తేలింది. మాటమాటా పెరిగి కోపంతో తల్లిని చంపేశాడు కొడుకు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
బాధితురాలు తన ఇద్దరు పిల్లలు, మనవరాలితో నివసించే లీజ్ ప్రాంతంలోని సెరాయింగ్లో ఈ సంఘటన జరిగింది. కొవిడ్ -19 మహమ్మారి తర్వాత కొడుకు తనతో కలిసి జీవించడానికి తిరిగి వచ్చినప్పటి నుండి తల్లి, కొడుకు తరచూ వాగ్వాదానికి దిగుతున్నట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..