Man Kills Mother: తల్లిని దారుణంగా చంపి.. ముక్కలు చేసి ఫ్రిడ్జిలో పెట్టి కాలువలో పడేశాడు..
Man Kills Mother: బెల్జియంలో 30 ఏళ్ల వ్యక్తి తన తల్లిని అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తల్లి శరీరాన్ని ముక్కలుగా నరికి భాగాలను ఫ్రిడ్జిలో పెట్టి ఓ కాలువలో పడేశాడు. గుర్తుతెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి ఈ హత్య గురించి చెప్పాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. ఆ ప్రాంతానికి వెళ్లినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. మద్యం మత్తులో ఉండి ఆ వ్యక్తి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు భావించారు. హత్య, ఛిద్రం చేయడం, శరీర భాగాలను రిఫ్రిజిరేటర్లో భద్రపరచడం గురించి తెలుసుకున్నట్లు కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్నాడు. తర్వాత పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించడంతో రిఫ్రిజిరేటర్లో మహిళ శరీర భాగాలు కనిపించాయి.
Also Read: Yamudu: భూమిపైకి ‘యముడు’.. నరకంలో శిక్షలు ఇక్కడే అమలు పరిస్తే?
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
రిఫ్రిజిరేటర్లో రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తదనంతరం వారు బాధితురాలి మొండెం, తలను మరొక కంటైనర్లో కనుగొన్నారు. ఆ మహిళ గోళ్లు, జ్యువెల్లరీ, టాటూల ఆధారంగా ఆచూకీని కనిపెట్టారు. అప్పటికే నిందితుడు అప్రమత్తమై దక్షిణ కొరియాకు పారిపోవాలని పథకం వేశాడు. కానీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తానే తన తల్లిని హత్య చేసినట్టు అంగీకరించాడు. ప్రాథమిక వివరాల ప్రకారం ఈ హత్య జులై 10న జరిగింది. తానే తన తల్లిని చంపేసి శరీరాన్ని ముక్కలు చేసి కాల్వలో పడేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. చాలా రోజులుగా తల్లి, కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయని విచారణలో తేలింది. మాటమాటా పెరిగి కోపంతో తల్లిని చంపేశాడు కొడుకు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
బాధితురాలు తన ఇద్దరు పిల్లలు, మనవరాలితో నివసించే లీజ్ ప్రాంతంలోని సెరాయింగ్లో ఈ సంఘటన జరిగింది. కొవిడ్ -19 మహమ్మారి తర్వాత కొడుకు తనతో కలిసి జీవించడానికి తిరిగి వచ్చినప్పటి నుండి తల్లి, కొడుకు తరచూ వాగ్వాదానికి దిగుతున్నట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!