Beerla Ilaiah : కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు..
- కేటీఆర్ వ్యాఖ్యలపై బీర్ల అయిలయ్య ఆగ్రహం
- ధరణి స్కాం డబ్బులతో ఎమ్మెల్యేలను కొనాలన్నది కేటీఆర్ ఉద్దేశం
- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు ప్రజలు ఊరించరు : బీర్ల ఐలయ్య
Beerla Ilaiah : ప్రజా ప్రభుత్వం పైన కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ బీర అయిలయ్య విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని, కేటీఆర్ వెకిలి చేష్టలతో కాళ్లలో కట్టెలు పెట్టినట్లు మాట్లాడుతున్నాడని బీర్ల ఐలయ్య వ్యాఖ్యానించారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో..లేకుంటే నాలుక కోస్తామని, అవినీతి డబ్బుతో పెట్టిన పింకీ మీడియా తో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చేస్తున్నాడని, ప్రజా ప్రభుత్వాన్ని కూల్చుతామని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడని, రియల్టర్లు, బ్రోకర్లు, భూ స్కాం లు చేసిన వారు చందాలు ఇస్తున్నరని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనమని చందాలు ఇస్తున్నారని మాట్లాడుతున్నాడని, మీ లాగా సంతలో పశువుల్లా మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోడు.. ప్రజలు ఎన్నుకున్న నిఖార్సైన ఎమ్మెల్యేలు అని ఆయన వ్యాఖ్యానించారు. మా ఎమ్మెల్యేలు ఎవరూ అమ్ముడు పోవడానికి సిద్ధంగా లేరని, నీ నాయకత్వం నచ్చకనే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీకి వచ్చారన్నారు.
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
ధరణితో భూములను కొల్లగొట్టి ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొనాలని కేటీఆర్ చూస్తున్నాడి ఆయన మండిపడ్డారు. కేటీఆర్..నీ అయ్య జేజమ్మ దిగివచ్చినా పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది…రాసి పెట్టుకో అని, అసెంబ్లీ ఎన్నికల్లో బొందపెట్టారు.. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చిన సిగ్గు రాలేదన్నారు బీర్ల ఐలయ్య. చిల్లర మల్లర రాజకీయాల్లో చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో తిరగనివ్వరని, పేదలకు సన్నబియ్యం ఇస్తు పేదోడి బువ్వ పెడుతుంటే ఓర్వలేక ప్రభుత్వాన్ని పడగొడతామని నీచాతి నీచంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం గురించి, ముఖ్యమంత్రి గురించి మరోసారి మాట్లాడితే గ్రామాల్లో ప్రజలు రాళ్లతో కొడతారు..జాగ్రత్త అని బీర్ల ఐలయ్య వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!