Beerla Ilaiah : కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు..
- కేటీఆర్ వ్యాఖ్యలపై బీర్ల అయిలయ్య ఆగ్రహం
- ధరణి స్కాం డబ్బులతో ఎమ్మెల్యేలను కొనాలన్నది కేటీఆర్ ఉద్దేశం
- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు ప్రజలు ఊరించరు : బీర్ల ఐలయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beerla Ilaiah : ప్రజా ప్రభుత్వం పైన కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ బీర అయిలయ్య విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని, కేటీఆర్ వెకిలి చేష్టలతో కాళ్లలో కట్టెలు పెట్టినట్లు మాట్లాడుతున్నాడని బీర్ల ఐలయ్య వ్యాఖ్యానించారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో..లేకుంటే నాలుక కోస్తామని, అవినీతి డబ్బుతో పెట్టిన పింకీ మీడియా తో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చేస్తున్నాడని, ప్రజా ప్రభుత్వాన్ని కూల్చుతామని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడని, రియల్టర్లు, బ్రోకర్లు, భూ స్కాం లు చేసిన వారు చందాలు ఇస్తున్నరని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనమని చందాలు ఇస్తున్నారని మాట్లాడుతున్నాడని, మీ లాగా సంతలో పశువుల్లా మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోడు.. ప్రజలు ఎన్నుకున్న నిఖార్సైన ఎమ్మెల్యేలు అని ఆయన వ్యాఖ్యానించారు. మా ఎమ్మెల్యేలు ఎవరూ అమ్ముడు పోవడానికి సిద్ధంగా లేరని, నీ నాయకత్వం నచ్చకనే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీకి వచ్చారన్నారు.
Also Read
- UN: ఫలించిన భారత్ పోరాటం.. నవంబర్ 27 అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవంగా ప్రకటన
- New ZPs: ఏపీలో జిల్లా పరిషత్ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
- Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
- Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
ధరణితో భూములను కొల్లగొట్టి ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొనాలని కేటీఆర్ చూస్తున్నాడి ఆయన మండిపడ్డారు. కేటీఆర్..నీ అయ్య జేజమ్మ దిగివచ్చినా పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది…రాసి పెట్టుకో అని, అసెంబ్లీ ఎన్నికల్లో బొందపెట్టారు.. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చిన సిగ్గు రాలేదన్నారు బీర్ల ఐలయ్య. చిల్లర మల్లర రాజకీయాల్లో చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో తిరగనివ్వరని, పేదలకు సన్నబియ్యం ఇస్తు పేదోడి బువ్వ పెడుతుంటే ఓర్వలేక ప్రభుత్వాన్ని పడగొడతామని నీచాతి నీచంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం గురించి, ముఖ్యమంత్రి గురించి మరోసారి మాట్లాడితే గ్రామాల్లో ప్రజలు రాళ్లతో కొడతారు..జాగ్రత్త అని బీర్ల ఐలయ్య వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Ee Paata Korinavaaru : ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత పొడవైన టైటిల్
-
UN: ఫలించిన భారత్ పోరాటం.. నవంబర్ 27 అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవంగా ప్రకటన
-
Telangana Weather: తెలంగాణకు కూల్ న్యూస్.. భారీ వానలపై క్లారిటీ ఇచ్చిన వాతావరణ కేంద్రం
-
Chadalavada :కొండపైన వెంకన్న సన్నిధిలా.. టీ నగర్లో అన్నగారి ఇల్లు
-
New ZPs: ఏపీలో జిల్లా పరిషత్ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!