Mohsin Naqvi-BCCI: ఖబర్దార్, ఇక చూసుకుందాం.. మోసిన్ నఖ్వీకి బీసీసీఐ వార్నింగ్!
- ఆసియా కప్ 2025ను గెలుచుకున్న భారత జట్టు
- ఏసీసీ కార్యాలయంలో ట్రోఫీ, మెడల్స్
- మోసిన్ నఖ్వీకి బీసీసీఐ వార్నింగ్
ఇటీవలే దాయాది పాకిస్థాన్ను ఓడించిన భారత జట్టు ఆసియా కప్ 2025ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం తర్వాత భారత జట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్, పీసీబీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి టీమిండియా నిరాకరించింది. దాంతో ఫైనల్ రోజు నఖ్వీ ట్రోఫీతో దుబాయ్లోని ఒక హోటల్కు వెళ్ళాడు. పాకిస్తాన్కు బయలుదేరే ముందు ట్రోఫీని ఏసీసీ కార్యాలయంలో ఉంచాడు. నఖ్వీ ట్రోఫీని భారత జట్టుకు ఇవ్వడానికి నిరాకరించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏసీసీ కార్యాలయానికి వచ్చి ట్రోఫీని తీసుకోవాలని షరతు పెట్టాడు.
ఆసియా కప్ 2025 ఫైనల్ ముగిసిన తర్వాత జరిగిన ఏసీసీ ఏజీఎం సమావేశంలో మోసిన్ నఖ్వీ తీరుపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రోఫీ, మెడల్స్ను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేసింది. అయినా కూడా పీసీబీ చీఫ్ వెనక్కి అగ్గడం లేదు. ఫైనల్ ముగిసి దాదాపు నెల కావొస్తున్నా.. ట్రోఫీ, మెడల్స్ భారత జట్టు చేతికి రాలేదు. దాంతో తాజాగా నఖ్వికి బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది. ట్రోఫీని సరైన పద్ధతిలో అప్పగించాలని, లేకపోతే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని నఖ్వికి పంపిన అధికారిక ఇ-మెయిల్లో హెచ్చరించింది. నఖ్వి నుంచి ఎటువంటి స్పందన రాకపోతే ఐసీసీకి ఫిర్యాదు తెలియజేస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా ఓ ప్రకటనలో తెలిపారు.
Also Read
- Raka: అల్లు అర్జున్ ‘రాకా’లో అక్షయ్ కుమార్.. అట్లీ మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా!
- Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
- Mamata Banerjee: ‘‘కరెంట్ తీసేస్తున్నారు’’.. ఓట్ల లెక్కింపునకు ముందు మమతా సంచలన ఆరోపణ..
- Mansarovar Yatra: మానస సరోవర్ యాత్రపై నేపాల్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..
Also Read: iQOO 15 Launch: 7000mAh బ్యాటరీ, మూడు 50MP కెమెరాలు.. అత్యంత శక్తివంతమైన ‘ఐకూ 15’ ఫుల్ ఫీచర్స్ ఇవే!
దేవ్జిత్ సైకియా ఇండియా టుడేతో మాట్లాడుతూ… ‘భారత జట్టుకు ట్రోఫీని అందజేయాలని మేము ఏసీసీకి లేఖ రాశాము. వారి ప్రతిస్పందన కోసం మేము ఎదురుచూస్తున్నాము. పీసీబీ చీఫ్ నుంచి ఎటువంటి స్పందన రాకపోతే మేము ఐసీసీకి లేఖ రాస్తాము. మేము దశల వారీగా ముందుకు సాగుతున్నాము’ అని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఎట్టిపరిస్థితుల్లో ట్రోఫీని స్వీకరించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఏసీసీ కార్యాలయంలో ట్రోఫీ అందజేయానికి తాను సిద్ధం అని నఖ్వీ పట్టుబడుతున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
Raka: అల్లు అర్జున్ ‘రాకా’లో అక్షయ్ కుమార్.. అట్లీ మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా!
-
Assam Assembly Election Results: హిమంత బిస్వా శర్మ 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా.. ఈసారి జలుక్బరి స్థానంలో ఎవరు గెలుస్తారు?
-
Mamata Banerjee: ‘‘కరెంట్ తీసేస్తున్నారు’’.. ఓట్ల లెక్కింపునకు ముందు మమతా సంచలన ఆరోపణ..
-
Mansarovar Yatra: మానస సరోవర్ యాత్రపై నేపాల్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!