BCCI: ఇకపై అలా ఆడకపోతే ఆటగాళ్ల పేమెంట్స్లో భారీగా కోత పడనుందా?
- ఆటగాళ్ల ప్రదర్శనపై సమీక్ష నిర్వహించిన బీసీసీఐ.
- ఆటగాళ్ల పెమెంట్స్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: గత ఏడాది స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్, ఆ తర్వాత జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియా చేసిన పేలవ ప్రదర్శన తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఆటగాళ్ల ప్రదర్శనపై సమీక్ష నిర్వహించిన బీసీసీఐ, ప్రదర్శన అంచనాలకు తగ్గట్లుగా ఆటగాళ్లకు అందించే పేమెంట్లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఆటగాళ్లలో జవాబుదారీతనాన్ని పెంచడానికి, అలాగే వారి ప్రదర్శన అంచనాలను మెరుగుపరచడానికి బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చేలా ప్లాన్ చేసింది. కేవలం గొప్ప ప్రదర్శన చేసే వారికి మాత్రమే నగదు రూపంలో ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఆడిన మ్యాచ్ల్లో ప్రదర్శన నిరుత్సాహకరంగా ఉంటే పేమెంట్స్లో కోత విధించడం వంటి కార్పొరేట్ తరహా వేరియబుల్ పే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
Also Read: Game Changer : గేమ్ ఛేంజర్ సినిమాపై డైరెక్టర్ శంకర్ షాకింగ్ కామెంట్స్
Also Read
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
- FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
గతేడాది భారత్ ఆడిన రెండు ప్రధాన సిరీస్లు గమనిస్తే, న్యూజిలాండ్ సిరీస్లో భారత్ వైట్వాష్ అవ్వడం, ఆస్ట్రేలియా సిరీస్ను 1-3 తేడాతో కోల్పోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా, సీనియర్ ఆటగాళ్లు తగిన ప్రదర్శన చేయకపోవడం బీసీసీఐకి ఈ నిర్ణయానికి ధరి తీసిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం అమలులో ఉన్న బీసీసీఐ ప్రోత్సాహక విధానం ప్రకారం ఒక సీజన్లో 50 శాతం టెస్టుల్లో తుది జట్టులో ఉన్న ఆటగాళ్లు రూ.30 లక్షల ప్రోత్సాహం పొందుతారు. అలాగే 75 శాతం మ్యాచ్లు ఆడితే ఈ మొత్తం రూ.45 లక్షలకు పెరుగుతుంది. ఇలాంటి విధానం ఆటగాళ్లు టెస్టులు లేదా వైట్బాల్ ఫార్మాట్లకు ప్రాధాన్యం ఇవ్వడం కోసం తీసుకువచ్చింది. కానీ, తాజాగా పర్ఫార్మెన్స్ ఆధారిత జీతాల విధానం మరింత కఠినంగా మారబోతున్నట్లు సమాచారం.
Also Read: TVS Jupiter: అమ్మకాలలో రికార్డ్స్ సృష్టిస్తున్న టీవీఎస్ జూపిటర్
బీసీసీఐ తుదిగా నిర్ణయించే కొత్త విధానం ఆటగాళ్లకు మరింత జవాబుదారీతనాన్ని కల్పించడంతో పాటు జట్టులో కొత్త ఒరవడిని మార్చడానికి ప్రేరణ కలిగించేలా ఉండనుంది. ఇది భారత క్రికెట్ను సమర్థవంతంగా ముందుకు నడిపించేందుకు మార్గదర్శకమవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Galla Siddharth : సౌత్ కొరియా అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి వివాహం
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ishqnama Trailer: సరిహద్దులు దాటిన ప్రేమ.. హృదయాలను కదిలిస్తున్న ‘ఇష్క్నామా’ ట్రైలర్
-
Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
-
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!