IND vs SL: శ్రీలంక టూర్కు జట్టు ఎంపిక నేడే.. సీనియర్లు ఆడాల్సిందే అంటున్న టీమిండియా కొత్త కోచ్!
- శ్రీలంక పర్యటనకు భారత జట్టు
- భారత హెడ్ కోచ్గా గంభీర్ బాధ్యతలు
- సీనియర్లు ఆడాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Head Coach Gautam Gambhir Says India Seniors have to play in Sri Lanka Tour: తాజాగా జింబాబ్వే టూర్ ముగించుకున్న భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంకతో పల్లెకెలె వేదికగా జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు ఆడనున్న టీమిండియా.. కొలంబోలో ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు త్వరలోనే లంకకు పయనం కానుంది. లంకకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. ఈ టూర్తోనే గౌతమ్ గంభీర్ భారత హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే వన్డేలలో సీనియర్లు తప్పక ఆడాలని కోరారట.
వ్యక్తిగత కారణాల వల్ల శ్రీలంకతో వన్డే సిరీస్కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు హార్దిక్ పాండ్యా బీసీసీఐకి సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు.. టీ20 ప్రపంచకప్ 2024 విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాలు వన్డే మ్యాచ్లకు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారట. అయితే వన్డే సిరీస్కు సీనియర్లు అందుబాటులో ఉండాలని కోచ్ గౌతమ్ గంభీర్ కోరినట్లు తెలుస్తోంది.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
Also Read: Pekamedalu Movie: తెలుగు ఇండస్ట్రీలో సరికొత్తగా.. రూ.50కే సినిమా టికెట్!
ఒకవేళ రోహిత్ శర్మ అందుబాటులో లేకుంటే.. కేఎల్ రాహుల్కు వన్డే జట్టు పగ్గాలు అప్పగించాలని గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడట. ఇక రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను సారథిగా, సూర్యకుమార్ యాదవ్ను వైస్ కెప్టెన్గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్క టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రవీంద్ర జడేజాకు వన్డే జట్టులో చోటు దక్కడం కష్టమే. అక్షర్ పటేల్ నుంచి అతడికి పోటీ ఉంది. ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించిన అక్షర్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్లో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్లు లంక టూర్కు ఎంపిక కానున్నారు.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!