IND vs SL: శ్రీలంక టూర్కు జట్టు ఎంపిక నేడే.. సీనియర్లు ఆడాల్సిందే అంటున్న టీమిండియా కొత్త కోచ్!
- శ్రీలంక పర్యటనకు భారత జట్టు
- భారత హెడ్ కోచ్గా గంభీర్ బాధ్యతలు
- సీనియర్లు ఆడాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Head Coach Gautam Gambhir Says India Seniors have to play in Sri Lanka Tour: తాజాగా జింబాబ్వే టూర్ ముగించుకున్న భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంకతో పల్లెకెలె వేదికగా జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు ఆడనున్న టీమిండియా.. కొలంబోలో ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు త్వరలోనే లంకకు పయనం కానుంది. లంకకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. ఈ టూర్తోనే గౌతమ్ గంభీర్ భారత హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే వన్డేలలో సీనియర్లు తప్పక ఆడాలని కోరారట.
వ్యక్తిగత కారణాల వల్ల శ్రీలంకతో వన్డే సిరీస్కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు హార్దిక్ పాండ్యా బీసీసీఐకి సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు.. టీ20 ప్రపంచకప్ 2024 విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాలు వన్డే మ్యాచ్లకు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారట. అయితే వన్డే సిరీస్కు సీనియర్లు అందుబాటులో ఉండాలని కోచ్ గౌతమ్ గంభీర్ కోరినట్లు తెలుస్తోంది.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
Also Read: Pekamedalu Movie: తెలుగు ఇండస్ట్రీలో సరికొత్తగా.. రూ.50కే సినిమా టికెట్!
ఒకవేళ రోహిత్ శర్మ అందుబాటులో లేకుంటే.. కేఎల్ రాహుల్కు వన్డే జట్టు పగ్గాలు అప్పగించాలని గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడట. ఇక రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను సారథిగా, సూర్యకుమార్ యాదవ్ను వైస్ కెప్టెన్గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్క టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రవీంద్ర జడేజాకు వన్డే జట్టులో చోటు దక్కడం కష్టమే. అక్షర్ పటేల్ నుంచి అతడికి పోటీ ఉంది. ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించిన అక్షర్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్లో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్లు లంక టూర్కు ఎంపిక కానున్నారు.
తాజావార్తలు
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!