IND vs SL: శ్రీలంక టూర్కు జట్టు ఎంపిక నేడే.. సీనియర్లు ఆడాల్సిందే అంటున్న టీమిండియా కొత్త కోచ్!
- శ్రీలంక పర్యటనకు భారత జట్టు
- భారత హెడ్ కోచ్గా గంభీర్ బాధ్యతలు
- సీనియర్లు ఆడాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Head Coach Gautam Gambhir Says India Seniors have to play in Sri Lanka Tour: తాజాగా జింబాబ్వే టూర్ ముగించుకున్న భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంకతో పల్లెకెలె వేదికగా జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు ఆడనున్న టీమిండియా.. కొలంబోలో ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు త్వరలోనే లంకకు పయనం కానుంది. లంకకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. ఈ టూర్తోనే గౌతమ్ గంభీర్ భారత హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే వన్డేలలో సీనియర్లు తప్పక ఆడాలని కోరారట.
వ్యక్తిగత కారణాల వల్ల శ్రీలంకతో వన్డే సిరీస్కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు హార్దిక్ పాండ్యా బీసీసీఐకి సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు.. టీ20 ప్రపంచకప్ 2024 విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాలు వన్డే మ్యాచ్లకు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారట. అయితే వన్డే సిరీస్కు సీనియర్లు అందుబాటులో ఉండాలని కోచ్ గౌతమ్ గంభీర్ కోరినట్లు తెలుస్తోంది.
Also Read
- Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
Also Read: Pekamedalu Movie: తెలుగు ఇండస్ట్రీలో సరికొత్తగా.. రూ.50కే సినిమా టికెట్!
ఒకవేళ రోహిత్ శర్మ అందుబాటులో లేకుంటే.. కేఎల్ రాహుల్కు వన్డే జట్టు పగ్గాలు అప్పగించాలని గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడట. ఇక రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను సారథిగా, సూర్యకుమార్ యాదవ్ను వైస్ కెప్టెన్గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్క టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రవీంద్ర జడేజాకు వన్డే జట్టులో చోటు దక్కడం కష్టమే. అక్షర్ పటేల్ నుంచి అతడికి పోటీ ఉంది. ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించిన అక్షర్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్లో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్లు లంక టూర్కు ఎంపిక కానున్నారు.
తాజావార్తలు
-
Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!
-
CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
-
Moto G77 Power: మోటో జి77 పవర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 50MP Sony LYTIA 600 కెమెరా
-
KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
-
Jailer 2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్కు కౌంట్డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?