IND vs SL: శ్రీలంక టూర్కు జట్టు ఎంపిక నేడే.. సీనియర్లు ఆడాల్సిందే అంటున్న టీమిండియా కొత్త కోచ్!
- శ్రీలంక పర్యటనకు భారత జట్టు
- భారత హెడ్ కోచ్గా గంభీర్ బాధ్యతలు
- సీనియర్లు ఆడాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Head Coach Gautam Gambhir Says India Seniors have to play in Sri Lanka Tour: తాజాగా జింబాబ్వే టూర్ ముగించుకున్న భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంకతో పల్లెకెలె వేదికగా జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు ఆడనున్న టీమిండియా.. కొలంబోలో ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు త్వరలోనే లంకకు పయనం కానుంది. లంకకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. ఈ టూర్తోనే గౌతమ్ గంభీర్ భారత హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే వన్డేలలో సీనియర్లు తప్పక ఆడాలని కోరారట.
వ్యక్తిగత కారణాల వల్ల శ్రీలంకతో వన్డే సిరీస్కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు హార్దిక్ పాండ్యా బీసీసీఐకి సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు.. టీ20 ప్రపంచకప్ 2024 విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాలు వన్డే మ్యాచ్లకు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారట. అయితే వన్డే సిరీస్కు సీనియర్లు అందుబాటులో ఉండాలని కోచ్ గౌతమ్ గంభీర్ కోరినట్లు తెలుస్తోంది.
Also Read
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
Also Read: Pekamedalu Movie: తెలుగు ఇండస్ట్రీలో సరికొత్తగా.. రూ.50కే సినిమా టికెట్!
ఒకవేళ రోహిత్ శర్మ అందుబాటులో లేకుంటే.. కేఎల్ రాహుల్కు వన్డే జట్టు పగ్గాలు అప్పగించాలని గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడట. ఇక రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను సారథిగా, సూర్యకుమార్ యాదవ్ను వైస్ కెప్టెన్గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్క టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రవీంద్ర జడేజాకు వన్డే జట్టులో చోటు దక్కడం కష్టమే. అక్షర్ పటేల్ నుంచి అతడికి పోటీ ఉంది. ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించిన అక్షర్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్లో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్లు లంక టూర్కు ఎంపిక కానున్నారు.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..