BCCI Awards 2024: ఉత్తమ క్రికెటర్గా శుభ్మన్ గిల్.. రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం!
Ravi Shastri awarded CK Nayudu Lifetime Achievement Award భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవార్డుల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ 2022-2023 సంవత్సరానికి ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (పాలీ ఉమిగ్రర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు) అవార్డును అందుకున్నాడు. మహిళల కేటగిరీలో బెస్ట్ క్రికెటర్ అవార్డు దీప్తి శర్మ సొంతం చేసుకుంది. ఇక మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. కరోనా మహమ్మారి కారణంగా 2019–20, 2020–21, 2021–22 సీజన్లలో బీసీసీఐ వార్షిక అవార్డులు ప్రదానం చేయలేకపోయారు. దాంతో నాలుగు సీజన్లకు సంబంధించిన పురుషులు, మహిళల, దేశవాళీ క్రికెటర్లకు అవార్డుల్ని ఒకేసారి ప్రదానం చేశారు.
1983లో భారత్ వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో రవిశాస్త్రి సభ్యుడు. అంతర్జాతీయ కెరీర్ అనంతరం టీవీ వ్యాఖ్యతగా ప్రేక్షకుల్ని అలరించాడు. ఆపై భారత పురుషుల టీమ్ డైరెక్టర్గా, హెడ్ కోచ్గా సేవలు అందించాడు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో జట్టును రవిశాస్త్రి మరో దశకు తీసుకెళ్లాడు. ఆటగాడిగా, కోచ్గా దేశానికి చేసిన సేవల్ని గుర్తించిన బీసీసీఐ.. 2019–20 సీజన్కు గాను సీకే నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్ (జీవిత సాఫల్య) అవార్డుతో సత్కరించింది. మరోవైపు భరత జట్టుకు చేసిన సేవలకు గాను ఫరూఖ్ ఇంజినీర్కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Also Read: Ayodhya Ram Mandir: సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు.. గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ కూడా!
పురుషుల విభాగంలో అంతర్జాతీయ క్రికెట్లో రాణించిన ఆటగాళ్లకు ఇచ్చే పాలీ ఉమ్రీగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల్ని 2019–20 సీజన్కుగాను సీనియర్ పేసర్ మొహ్మద్ షమీ అందుకోగా.. 2020–21 సీజన్లో ఆర్ అశ్విన్, 2021–22 సీజన్లో జస్ప్రీత్ బుమ్రా అందుకున్నాడు. మహిళల కేటగిరీలో ఇదే అవార్డును దీప్తి శర్మ (2019–20, 2022–23), స్మృతి మంధాన (2020–21, 2021–22) అందుకున్నారు. యశస్వి జైస్వాల్ 2022–23 సీజన్కు ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం అవార్డు దక్కింది. ఈ విభాగంలో మయాంక్ అగర్వాల్ (2019, 20), అక్షర్ పటేల్ (2020–21), శ్రేయస్ అయ్యర్ (2021–22) అవార్దులు అందుకున్నారు. ఇంకా అనేక విభాగాల్లో క్రికెటర్లకు అవార్డులను అందించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో