BCCI: అప్పుడు తొలగించింది.. ఇప్పుడు మరలా అపాయింట్ చేసుకుంది!
- బీసీసీఐ కీలక నిర్ణయం
- ఫీల్డింగ్ కోచ్గా టి దిలీప్
- సంవత్సర కాలం పాటు జట్టుతో దిలీప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం న్యూజిలాండ్తో జరిగిన స్వదేశీ టెస్ట్ సిరీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఓటముల నేపథ్యంలో ఇద్దరు వీడ్కోలు పలికారు. ఈ రెండు సిరీస్ల అనంతరం ఆటగాళ్ల స్థాయిలోనే కాకుండా కోచింగ్ బృందంలో కూడా చాలా మార్పులు జరిగాయి. టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్లను గత నెలలో వారి పదవుల నుంచి బీసీసీఐ తొలగించింది. అయితే ఇప్పుడు బీసీసీఐ అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. దిలీప్ను తిరిగి ఇంగ్లండ్ పర్యటనకు ఫీల్డింగ్ కోచ్గా ఎంపిక చేసింది. ఓ సంవత్సర కాలం పాటు అతడు జట్టుతో ఉండనున్నాడు.
ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ పర్యటన కోసం టి దిలీప్ను మరోసారి ఫీల్డింగ్ కోచ్గా బీసీసీఐ నియమించింది. ఫీల్డింగ్ కోచ్గా విదేశీయుడిని నియమించాలని బీసీసీఐ ప్రయత్నించనా.. అది కుదరలేదు. దాంతో భారత జట్టు సభ్యులతో మంచి అనుబంధం ఉన్న దిలీప్ను తిరిగి ఎంపిక చేసింది. ‘దిలీప్ మంచి కోచ్. అతను మూడు సంవత్సరాలకు పైగా (2021 నుండి) జట్టుకు సేవలు అందించాడు. ఆటగాళ్ల బలాబలాలు అతడికి బాగా తెలుసు. ఇంగ్లండ్తో జరిగే సిరీస్కు అతన్ని జట్టులో చేర్చుకోవడం మంచిది విషయం’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. నిజానికి జట్టులో దిలీప్ హయాంలో టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలను బాగా మెరుగయ్యాయి.
Also Read
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్గా శుభ్మాన్ గిల్ ఎంపికయిన విషయం తెలిసిందే. జూన్ 20 నుంచి ఇంగ్లండ్, భారత్ మధ్య ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. జూన్ 3న అహ్మదాబాద్లో జరిగే ఐపీఎల్ 2025 ఫైనల్కు గుజరాత్ అర్హత సాధిస్తే.. జూన్ 6 నుంచి ఇంగ్లండ్ లయన్స్తో జరిగే వార్మప్ మ్యాచ్కు శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్ అందుబాటులో ఉండరు. ఐపీఎల్ ఫైనల్ అనంతరం భారత జట్టు ఇంగ్లండ్ పయనమయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
-
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!