BC Janardhan Reddy: దాతృత్వం చాటిన బీసీ జనార్థన్ రెడ్డి దంపతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజ్యమేలిన ఆ గడ్డపై ఇప్పుడు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్నాయి. హత్యారాజకీయాలతో అట్టుడుకిపోయిన ఆ నేల ఇప్పుడు దైవ నామస్మరణలతో మార్మోగిపోతుంది. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన ఆ నాయకుడు… ప్రజలకు సేవ చేయడమే కాదు… లెక్కకు మించిన దాన ధర్మాలు, గుప్తదానాలు చేస్తూ ధార్మిక సేవలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు. ఆయనే బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి. బనగానపల్లెలో ధర్మ పరిరక్షణకు బీసీ జనార్థన్ రెడ్డి పాటుపడుతున్నారు.
B.V. Raghavulu: మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల మనుగడ కష్టమే..
Also Read
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
నంద్యాల జిల్లాలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం బనగానపల్లె నియోజకవర్గం. కాలజ్ఞానం రాసిన పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి నడయాడిన ఈ నేలపై యాగంటి ఉమా మహేశ్వరస్వామి ఆలయం, రవ్వలకొండ, శ్రీ లక్ష్మీ సమేత మద్దిలేటి స్వామివారి ఆలయం వంటి ఎన్నో చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలు విలసిల్తుతున్నాయి. ఇటువంటి పుణ్యభూమిలో పలు దేవాలయాలకు ఎన్నో దాన ధర్మాలు, గుప్తదానాలు చేస్తూ గొప్ప ధార్మిక సేవ చేస్తున్న పుణ్య దంపతులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి, ఆయన సతీమణి బీసీ ఇందిరా రెడ్డి.
Joe Biden: పుతిన్పై బైడెన్ దూషణల పర్వం.. బూతు మాటతో స్పీచ్ స్టార్ట్..!
తాజాగా తమ ఇంటి దైవమైన బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం సమీపంలో కొలువైన శ్రీ లక్ష్మి మద్దిలేటి స్వామి వార్ల క్షేత్రంలో రూ. 15 లక్షల సొంత నిధులతో మెట్ల మార్గం, పైకప్పు నిర్మాణం చేపట్టి మరోసారి బీసీ జనార్థన్ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గతంలోనే రూ.8 లక్షలతో కొండపైకి మెట్ల మార్గం నిర్మించి భక్తుల ఇబ్బందులు తొలగించారు. తాజాగా వేసవి కాలంలో భక్తులు ఇబ్బంది పడకుండా రూ. 7 లక్షలతో మెట్ల మార్గంలో పైకప్పు నిర్మాణం కూడా చేపట్టి తన దయాగుణాన్ని మరోసారి చాటుకున్నారు. బీసీ జనార్థన్ రెడ్డి దాతృత్వంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా బనగానపల్లె నియోజకవర్గంలోనే కాకుండా నంద్యాల జిల్లావ్యాప్తంగా పలు ఆలయాలకు వితరణ అందిస్తూ.. జనార్థన్ రెడ్డి దంపతులు గొప్ప ధార్మిక సేవాతత్పరులుగా నిలుస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.
తాజావార్తలు
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..