BC Janardhan Reddy: దాతృత్వం చాటిన బీసీ జనార్థన్ రెడ్డి దంపతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజ్యమేలిన ఆ గడ్డపై ఇప్పుడు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్నాయి. హత్యారాజకీయాలతో అట్టుడుకిపోయిన ఆ నేల ఇప్పుడు దైవ నామస్మరణలతో మార్మోగిపోతుంది. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన ఆ నాయకుడు… ప్రజలకు సేవ చేయడమే కాదు… లెక్కకు మించిన దాన ధర్మాలు, గుప్తదానాలు చేస్తూ ధార్మిక సేవలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు. ఆయనే బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి. బనగానపల్లెలో ధర్మ పరిరక్షణకు బీసీ జనార్థన్ రెడ్డి పాటుపడుతున్నారు.
B.V. Raghavulu: మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల మనుగడ కష్టమే..
Also Read
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
- Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
నంద్యాల జిల్లాలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం బనగానపల్లె నియోజకవర్గం. కాలజ్ఞానం రాసిన పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి నడయాడిన ఈ నేలపై యాగంటి ఉమా మహేశ్వరస్వామి ఆలయం, రవ్వలకొండ, శ్రీ లక్ష్మీ సమేత మద్దిలేటి స్వామివారి ఆలయం వంటి ఎన్నో చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలు విలసిల్తుతున్నాయి. ఇటువంటి పుణ్యభూమిలో పలు దేవాలయాలకు ఎన్నో దాన ధర్మాలు, గుప్తదానాలు చేస్తూ గొప్ప ధార్మిక సేవ చేస్తున్న పుణ్య దంపతులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి, ఆయన సతీమణి బీసీ ఇందిరా రెడ్డి.
Joe Biden: పుతిన్పై బైడెన్ దూషణల పర్వం.. బూతు మాటతో స్పీచ్ స్టార్ట్..!
తాజాగా తమ ఇంటి దైవమైన బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం సమీపంలో కొలువైన శ్రీ లక్ష్మి మద్దిలేటి స్వామి వార్ల క్షేత్రంలో రూ. 15 లక్షల సొంత నిధులతో మెట్ల మార్గం, పైకప్పు నిర్మాణం చేపట్టి మరోసారి బీసీ జనార్థన్ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గతంలోనే రూ.8 లక్షలతో కొండపైకి మెట్ల మార్గం నిర్మించి భక్తుల ఇబ్బందులు తొలగించారు. తాజాగా వేసవి కాలంలో భక్తులు ఇబ్బంది పడకుండా రూ. 7 లక్షలతో మెట్ల మార్గంలో పైకప్పు నిర్మాణం కూడా చేపట్టి తన దయాగుణాన్ని మరోసారి చాటుకున్నారు. బీసీ జనార్థన్ రెడ్డి దాతృత్వంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా బనగానపల్లె నియోజకవర్గంలోనే కాకుండా నంద్యాల జిల్లావ్యాప్తంగా పలు ఆలయాలకు వితరణ అందిస్తూ.. జనార్థన్ రెడ్డి దంపతులు గొప్ప ధార్మిక సేవాతత్పరులుగా నిలుస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.
తాజావార్తలు
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?