Bandi Sanjay : రేవంత్ రెడ్డి, కేటీఆర్ జాన్ జబ్బలు
- రేవంత్-కేటీఆర్ మధ్య రహస్య ఒప్పందం?
- వక్ఫ్ బిల్లు నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు కలిసి వ్యూహం
- హెచ్ సీయూ భూములపై సీబీఐ విచారణకు బండి సంజయ్ సవాల్
Bandi Sanjay : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపే వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కలిసి పని చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా కనిపిస్తున్నా, వాస్తవానికి వీరి మధ్య రహస్య ఒప్పందం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ జాన్ జబ్బలు అని, ఇద్దరూ కలిసే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నది రేవంత్ రెడ్డి అని బండి సంజయ్ ఆరోపించారు. చెన్నైలో నిర్వహించిన డీలిమిటేషన్ మీటింగ్కు ఇద్దరూ కలిసి వెళ్లిన దానికి ఇదే నిదర్శనమన్నారు. అంతేకాదు, హైదరాబాద్లో జరగబోయే సమావేశాన్ని కూడా ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తున్నారని, వీరిద్దరూ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారని తెలిపారు.
Also Read
- SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ 'నో-లుక్' షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- Freezer Ice Smell Solution: ఫ్రీజర్లోని ఐస్ నుంచి దుర్వాసన వస్తుందా..? 2 నిమిషాల్లో తొలగించే సులభమైన చిట్కాలు..!
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఓటేయించారని, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ను గెలిపించేందుకు వీరిద్దరూ కలిసి ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దింపకపోవడం కూడా రేవంత్కు మద్దతు ఇచ్చేందుకే చేసిన చర్య అని తెలిపారు.
తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పినా కేటీఆర్కు బుద్ధి రాలేదని బండి సంజయ్ విమర్శించారు. ఇద్దరూ కలిసి బీజేపీని నిలబెట్టకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై జరిగిన భూ దందాకు సంబంధించిన సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డిని కాపాడేందుకు కేంద్రంలో కేసీఆర్ లేదా రేవంత్ ప్రభుత్వాలు ఏమాత్రం సహకరించలేవని, కేంద్రంలో మోదీ సర్కారే భూదందా, అవినీతిపై ఉక్కుపాదం మోపుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
హెచ్ సీయూ భూముల వ్యవహారాన్ని సీబీఐ విచారణ ద్వారా బహిరంగం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజల ఆశలతో ఆడుకుంటున్న ఈ ద్వంద్వ రాజకీయ నాయకుల అసలైన ముఖాలను బహిర్గతం చేయడానికి బీజేపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
Rajasthan: దళిత ఎమ్మెల్యే వచ్చాడని ఆలయ “శుద్ధి”.. వివాదస్పద నేతని సస్పెండ్ చేసిన బీజేపీ..
తాజావార్తలు
-
Pat Cummins: వాళ్లిద్దరూ అరివీర భయంకరులు.. ఐయామ్ సేఫ్ బాబోయ్.. కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు!
-
SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ ‘నో-లుక్’ షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్య వివాహం
-
Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
-
Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?