Bandi Sanjay : “కాంగ్రెస్ ఖేల్ ఖతం… దుకాణ్ బంద్”
- రాహుల్ హామీలపై బీజేపీ ధ్వజం
- కాంగ్రెస్ పార్టీని హామీల మోసాలు చేసిన పార్టీ
- రాజీవ్ రహదారి పై అసలైన బాధ్యులు ఎవరు?
- కాంగ్రెస్ డ్రామాలకు ప్రజలు బాధితులు : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. మెదక్ జిల్లా ఎల్లారెడ్డిపేటలో జరిగిన సభలో ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్ ఖేల్ ఖతం, దుకాణ్ బంద్” అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం స్వయంగా చేసిన వ్యాఖ్యలే వారి వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్, మహిళలకు నెలనెలా రూ.2,500, తులం బంగారం వంటి హామీలు నేరవేర్చని ప్రభుత్వం, నిరుద్యోగులకు వాగ్దానం చేసిన రూ.4,000 భృతి కూడా ఇవ్వడం లేదన్నారు. అంతేకాదు, విద్యార్థులకు హామీగా చెప్పిన రూ.5 లక్షల భరోసా కార్డు ఇప్పుడు లేదన్నట్టే తేలిందని విమర్శించారు.
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మళ్లీ షాక్..!
Also Read
- Door Mat Cleaning: డోర్ మ్యాట్ ఎంత ఉతికినా మురికిగానే ఉంటుందా.. ఈ చిట్కాతో మురికి మాయం..
- Cleaning Tips: బాత్రూమ్లో వాడే ప్లాస్టిక్ డబ్బాకు మరకలు పోవడం లేదా..? ఈ చిన్న చిట్కాతో మెరిసిపోతుంది..
- Italy: ఇటలీ ప్రధాని మెలోనీకి పొంచి ఉన్న జెన్-జీ ముప్పు.. 2027 ఎన్నికల ముందు ఝలక్ తప్పదా?
- US: వర్జీనియా వర్శిటీలో కాల్పులు.. పలువురికి గాయాలు
“సంవిధాన్” చూపిస్తూ రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ బండి సంజయ్, ఆయన వాటికి సమాధానం చెప్పక తప్పదన్నారు. రేపటి నుంచి కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రజల మధ్య నిలదీస్తామని హెచ్చరించారు. రాజీవ్ రహదారి నిర్మాణం, నాణ్యతపై వస్తున్న విమర్శలపై కూడా బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ఈ రహదారిని కాంగ్రెస్ ప్రభుత్వం నాగుపాముల్లా వంకరటింకరగా నిర్మించిందని, కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకం పనులు చేయించిందని ఆరోపించారు. ఇకపై 2035 వరకు కాంట్రాక్టర్తో ఒప్పందం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని గుర్తు చేశారు. ఈ సమస్యను పరిష్కరించి, 6 లేన్ జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2022లోనే ప్రతిపాదనలు చేసిన విషయాన్ని సంజయ్ స్పష్టం చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోందని బండి సంజయ్ విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డకు కూడా కేంద్ర మంత్రి గడ్కరీ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టు గుర్తుచేశారు. లేఖల పేరుతో కేంద్రంపై బురద చల్లడాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు, మంత్రులు కూడా స్పష్టత ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
Civil Mock Drill : రేపటి మాక్ డ్రిల్ నిర్వహించే విధానం ఇదే..
తాజావార్తలు
-
Tamil Nadu: ‘‘తండ్రి ఎవరో తల్లిని అడగాలి’’.. విజయ్ వ్యాఖ్యలకు బీజేపీ చీఫ్ షాకింగ్ కౌంటర్
-
Door Mat Cleaning: డోర్ మ్యాట్ ఎంత ఉతికినా మురికిగానే ఉంటుందా.. ఈ చిట్కాతో మురికి మాయం..
-
Cleaning Tips: బాత్రూమ్లో వాడే ప్లాస్టిక్ డబ్బాకు మరకలు పోవడం లేదా..? ఈ చిన్న చిట్కాతో మెరిసిపోతుంది..
-
CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
-
Faria Abdullah: బోరున ఏడ్చేసిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.. బోనాల నుంచి ఇస్లాం వరకు ఏం జరిగిందో చెప్పిన చిట్టి!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!