Bandi Sanjay : హిందూ బంధువులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల్లోని హిందూ బంధువులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఈ భోగి పండుగ భోగ భాగ్యాలను అందించాలని, సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త కాంతిని నింపాలని, కనుమ పండుగ కన్నుల పండుగై మీ ఇంటిలో సుఖసంతోషాలు, ఆనందానురాగాలు పంచాలని ఆ అమ్మ వారిని వేడుకుంటున్నానన్నారు. అంతేకాకుండా హిందువుల ఆత్మ గౌరవ ప్రతీక, భారతీయుల 5 శతాబ్దాల నిరీక్షణ అయోధ్య రామ మందిర ప్రతిష్ట అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
ఈనెల 22న భవ్యమైన దివ్యమైన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతున్న శుభ సందర్భాన మీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మన ప్రియతమ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈనెల 22న ప్రతి ఒక్కరూ మీ దగ్గరలోని ఆలయానికి వెళ్ళి భగవంతుని దర్శించుకోవాలి. సాయంత్రం ప్రతి ఇంటా ఐదు దీపాలు వెలిగించి వెలుగులు నింపాలని కోరుతున్నానని ఆయన తెలిపారు. మరొక్కసారి మీ అందరికీ సంక్రాంతి పండుగ, అయోధ్య రామాలయ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు బండి సంజయ్.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..