Bandi Sanjay : 340 మందికి నియామక పత్రాలు అందజేసిన బండి సంజయ్
- హకీం పేట్ లోని నిసా కేంద్రంలో రోజ్ గార్ మేళా
- పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసిన బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : హకీం పేట్ లోని నిసా కేంద్రంలో రోజ్ గార్ మేళా లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. 340 మందికి నియామక పత్రాలను బండి సంజయ్ అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశ యువత సాధికారత లక్ష్యంగా ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అంకితభావం, పారదర్శకతతో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులైన వారికి అభినందనలు తెలిపారు బండి సంజయ్. అంతేకాకుండా.. సీఐఎఎస్, బిఎస్ఎఫ్, ఐటీవీపీ, ఐఐటీ లలో ఉద్యోగాలు రావడం సంతోషమన్నారు. ప్రధాని మోడీ కి ఇష్టమైన కార్యక్రమం రోజ్ గర్ మేళా అని ఆయన వ్యాఖ్యానించారు.
Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేడు తులం బంగారం ధర ఎంతుందంటే?
Also Read
- Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ఇప్పటికీ 8 లక్షల 50 వేల మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చామని, 10 లక్షల మందికి ఉద్యోగాలు అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని బండి సంజయ్ తెలిపారు. కేంద్రప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ పథకాలు అందరికీ చెచుకోవాలనేదే మా ఆకాంక్ష అని, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని శాఖలకు చెందిన ఖాళీలను భర్తీ చేస్తున్నామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చాము.ప్రపంచంలో భారత దేశం 3 వ ఆర్థిక శక్తి గా ఎదిగిందన్నారు. దళారీలు,కోర్టు కేసులు,పేపర్ లీకేజీలు లేకుండా పారదర్శకత తో ఉద్యోగ నియామకాలు చేపట్టింది కేవలం మోడీ సర్కారే అని, స్టార్ట్ అప్ ఇండియా లతో మోడీ ఉద్యోగ కల్పన చేయడంలో కీలక భూమిక పోషిస్తున్నారన్నారు. పేరు కోసం మాటలు చెప్పే వారిని,ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిని ప్రజలు విశ్వసించడం లేదన్నారు. డిజిటల్ యుగాన్ని తీసుకువచ్చి దేశ స్థితి గతులను మార్చారు..వ్యవసాయ రంగంలో ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామన్నారు బండి సంజయ్.
Uppal Fly Over: ఉప్పల్- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు పునఃప్రారంభం
తాజావార్తలు
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!