Bandi Sanjay : కేంద్రం ఉద్యోగాలు ఇస్తుంటే… ఈ ప్రభుత్వం ఉద్యోగాలు తొలగిస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ మూడు రోజుల శిక్షణ శిబిరాలు నేటితో ముగిశాయి. అయితే.. చివరి రోజు ముగింపు సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే సీఎం కుటుంబానికి కమిషన్ ఇవ్వాలని, భాగ స్వామ్యం ఇవ్వాలని ఆయన అన్నారు. కేసీఆర్ ఏ రోజు రాష్ట్రానికి లాభం జరగాలి అని ఆలోచించడని ఆయన మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వమని, కేంద్ర నిధులు దారి మళ్లిస్తున్నాడని ఆయన ఆరోపించారు. పది లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు సాగుతుంది మోడీ ప్రభుత్వమని, కేంద్రం ఉద్యోగాలు ఇస్తుంటే… ఈ ప్రభుత్వం ఉద్యోగాలు తొలగిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ప్రమోషన్ లు ఇవ్వకుండా రివర్సన్ లు ఇస్తున్నాడని, కమ్యూనిస్ట్ లు కార్మికుల కోసం అంటున్నారు… సీఎం దగ్గర మొకరిల్లారని, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లతో కలిసి పోటీ చేద్దామని కేసీఆర్ వాళ్ల కార్యకర్తలకు చెబుతున్నారన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా బీజేపీనీ అప్రదిష్ట పాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Megastar Chiranjeevi: అప్పుడు అవమానించారు.. ఇప్పుడు అవార్డు ఇస్తున్నారు
తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు. అంతేకాకుండా.. ‘ప్రజలకు ఉపయోగపడే ఏ సంక్షేమ పథకాన్ని బీజేపీ రద్దు చేయదు. తెలంగాణలోని పేదలందరికీ ఉచిత విద్యా వైద్యం ఇస్తామని ప్రకటించాము, పేదలందరికీ పక్క గృహాలు నిర్మించి ఇస్తామని చెప్పాము అధికారం లోకి వచ్చాక నెరవేరుస్తాము. కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ ను రగిల్చి అధికారం లోకి రావడానికి చూస్తున్నారు. సీఎం కేసీఆర్ తెలుసుకోవాలి… ఈ దేశం కోసం పని చేసే వారు సంఘ్ ప్రచారక్ లు…అలాంటి వ్యక్తులను సీఎం అవమానిస్తున్నారు. సీఎం నీ లాంటి మూర్ఖుల నుండి రాష్ట్రాన్ని రక్షించడానికి వాళ్ళు పని చేస్తున్నారు….బి ఎల్ సంతోష్ జి ఏమి చేశారు. ఆయనకు ఫాంహౌస్ లు లేవు, బ్యాంక్ అకౌంట్ లు లేవు. అయన ఎమ్మెల్యే, ఎంపీ కావాలని అనుకోలేదు. అయన ఈ దేశం కోసం పని చేసే వ్యక్తి.. అయన జోలికి వస్తే బీజేపీ సహించే ప్రసక్తే లేదు. నీ కుటుంబం కోసం, నీ రాజకీయ లబ్ది కోసం, కొడుకు కూతురు స్కాంలో నుండి బయట పడేందుకు ఆయనను అవమానిస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు.
Also Read
- Indian Origin Cricketer: ఆ క్రికెటర్కు బిగ్షాక్ ఇచ్చిన ఐసీసీ.. 8 ఏళ్లు నిషేధం..
- E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
తాజావార్తలు
-
Indian Origin Cricketer: ఆ క్రికెటర్కు బిగ్షాక్ ఇచ్చిన ఐసీసీ.. 8 ఏళ్లు నిషేధం..
-
TGSRTC Results : ఆర్టీసీ జాబ్స్ రిజల్ట్స్ విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే.!
-
E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
-
Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
-
Sukumar – DSP: దేవిశ్రీ ప్రసాద్ – సుకుమార్ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!