Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandi Sanjay Criticized Cm Kcr 3

Bandi Sanjay : టీఆర్‌ఎస్‌ పతనం.. కేసీఆర్‌ ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది

Published Date :August 21, 2022 , 8:23 am
By Gogikar Sai Krishna
Bandi Sanjay : టీఆర్‌ఎస్‌ పతనం.. కేసీఆర్‌ ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం చుట్టు తిరుగుతోంది. అయితే.. మనుగోడు ప్రజాదీవెన పేరిటి టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే.. సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ.. మునుగోడు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని వింటే… ఆయన గొంతులో వణుకు, మాటల్లో భయం, అసహనం కన్పించాయన్నారు. ఆల్రెడీ టీఆర్ఎస్ పతనం ఖాయమైనట్లుగా ఆయన ప్రసంగంలో స్పష్టంగా కన్పించిందని, చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రధానమంత్రివర్యులు, కేంద్ర హోంమంత్రి వర్యులపై అవాకులు చవాకులు పేలారన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మాట్లాడే భాషేనా అది ? అని బండి సంజయ్‌ మండిపడ్డారు. ఆయన ప్రసంగం విన్న ప్రతి ఒక్కరూ ఛీదరించుకుంటున్నారని బండి సంజయ్‌ విమర్శించారు. ఈడీ అంటే ఎంత భయమో ఆయన మాటల్లోనే అర్ధమైందని, అందుకే ఆ సంస్థపై నోటికొచ్చినట్లు తూలనాడారన్నారు. పచ్చి అబద్దాలు, దొంగ మాటలతో మునుగోడు ప్రజలను కేసీఆర్ మాయ చేసే ప్రయత్నం చేశారని, పదేపదే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ రైతులను బ్లాక్ మెయిల్ చేసి ఓట్లేయించుకోవాలని చూస్తున్నారన్నారు. కానీ రైతులకు వాస్తవాలు తెలుసునని, ఇదే విషయాన్ని దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా ప్రచారం చేసి బొక్కబోర్లా పడ్డారన్నారు.

 

Also Read

  • Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్
  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
  • AP SSC Results 2026: ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..
  • Heinrich Klaasen: ప్రతి రూపాయికి విలువ.. ఆరెంజ్ ఆర్మీకి అసలైన హీరో.. హెన్రిచ్ క్లాసెన్ సూపర్ ఫామ్.!

బావుల వద్ద ఫ్రీ కరెంట్ ఇస్తూ… ఇండ్ల వద్ద కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై కేంద్రాన్ని నిందించడం సిగ్గు చేటని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా రాకపోవడానికి ముమ్మాటికీ కేసీఆరే కారణమన్నారు బండి సంజయ్‌. నేను ఎన్నోసార్లు ఆధారాలతోసహా నిరూపించానని, నాటి కేంద్ర జలశక్తి మాత్యులు ఉమాభారతి గారి సమయంలో జరిగిన అపెక్స్ సమావేశంలో 299 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించేందుకు అంగీకరిస్తూ సంతకం చేసిన ఆధారాలను పలుమార్లు బయటపెట్టానన్నారు. వాస్తవానికి కృష్ణా జలాల్లో తెలంగాణకు 575 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా… 299 టీఎంసీలకే ఒప్పుకున్న ఈ ముఖ్యమంత్రి కేసీఆర్. పక్క రాష్ట్రం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పేరుతో క్రిష్ణా నీటిని మళ్లించుకొని పోతుంటే… పట్టించుకోకుండా కుంభకర్ణుడలా ఫాంహౌజ్ లో పడుకున్నాడు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతుందని నేను పదేపదే హెచ్చరించినా పట్టించుకోకుండా ఈ ప్రాంత ప్రజలకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి కేసీఆర్ అని బండి సంజయ్‌ ఆరోపించారు. మునుగోడుతో సహా రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలందరికీ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా విషయంలో జరిగిన అన్యాయానికి ముమ్మాటికీ కేసీఆరేననే విషయం తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసు అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp
  • cm kcr
  • latest news
  • munugodu bypoll

తాజావార్తలు

  • Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్

  • Bhoghi : ‘కందుల సులోచన రాణి’గా.. అనుపమ.. ఫస్ట్ లుక్ బాగుంది

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!

  • Dhruva Natchathiram : విక్రమ్ సినిమా వస్తోంది.. కానీ సూర్యతో పోటీ తప్పేలా లేదు

ట్రెండింగ్‌

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions