NTV Telugu Site icon

Bandi Sanjay : నేత కార్మికులు పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది

Bandi Sanjay

Bandi Sanjay

రాజన్న సిరిసిల్ల పట్టణంలో ఇటీవల మరణించిన ఊరగొండ రాజు కుటుంబాన్ని కేంద్ర హోoశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. నేత కార్మికుల కరెంటు బిల్లుల విషయంలో గత ప్రభుత్వం, కొత్త ప్రభిత్వం మోసం చేసిందన్నారు. నేత కార్మికులకు రెండు పార్టీలు కలిసి 50 శాతం సబ్సిడీ ఇస్తామని మోసం చేశారని, ప్రభుత్వానికి మేము సలహాలు సూచనలు ఇస్తే మాపై నిందలు మోపుతున్నారన్నారు బండి సంజయ్‌. నేత కార్మికులు పరిస్థితి పెనం నుండి పోయిల పడ్డట్టు అయ్యిందని, నేత కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుతార్ని కి లెటర్ రాస్తామన్నారు బండి సంజయ్‌. N కన్వేషన్ కూల్చేసి తెలంగాణ ప్రజలకు సినీమా చూపిస్తున్నారని, హైడ్రా పై పూర్తి అవగాహన ప్రజలకు ఇవ్వాలన్నారు బండి సంజయ్‌. పెద్దోళ్ళని కొట్టి చిన్నోళ్ళకు ఇవ్వాలని, తెలిసి తెలియక కొందరు ఇల్లులు కట్టుకున్నారు వాటిని కూలిస్తే ఎలా అని ఆయన వ్యాఖ్యానించారు. జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరవేసి జైల్ పోయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు పౌరుశం ఎటుపోయిందని, స్కలం చెరువు ఎందుకు కూల్చడం లేదని, ఓవైసీ పై రేవంత్ రెడ్డి ద్వంద వైఖరి వ్యవహరిస్తున్నారన్నారు బండి సంజయ్‌.

  Bengal assembly: కోల్‌కతా ఘటన నేపథ్యంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

అంతేకాకుండా..’సల్కం చేరులో కట్టిన కాలేజి లో చదువుతున్న వారికి వేరే కాలేజీలో అడ్మిషమన్ ఇచ్చి అనుమతి లేని భవనాలు కూల్చాలి. ఓవైసీ మాపై చేయి వేస్తే అంతు చూస్తామని హెచ్చరించడంతో వెనక్కు తగ్గిన రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ 47 వెయిలా కోట్లు విడుదల చేస్తామని చెప్పి 17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసారు. రైతు రుణమాఫీ అనేది బోగస్. హైడ్రా పేరుతో ఆరు గ్యారంటీ లు పక్క దోవ పట్టిస్తున్నారు. సుప్రీం కోర్టు విషయంలో అందరూ జాగ్రత్తగా మాట్లాడాలి. కవిత కోసం మాట్లాడిన అడ్వకేట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిషేక్ సింన్గ్వి. బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సీటు కోసం ఎందుకు నామినేషన్ ఎందుకు వేయలేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అని ప్రజలకు తెలుసు. రేపు ఎల్లుండో యువరాజు కు అప్పగింతలు అమెరికాలో జరుగుతున్నాయి.’ అని బండి సంజయ్‌ అన్నారు.

Off The Record : తెలంగాణ బీజేపీ నాయకులు ఢిల్లీ హై కమాండ్ నే భయపెడుతున్నారా? రాష్ట్ర పార్టీల్లో ఏంజరుగుతుంది