Bengal assembly: కోల్కతా ఘటన నేపథ్యంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
- కోల్కతా ఘటన నేపథ్యంలో బెంగాల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
- అత్యాచార ఘటనలపై మరణశిక్ష విధించేలా చట్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్న ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఒక వైపు ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. మరోవైపు దర్యాప్తు కొనసాగుతోంది. అయినా విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇంకో వైపు మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. విపక్ష పార్టీలన్నీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చింది. సోమవారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయని తెలిపింది.
ఇది కూడా చదవండి: Weight Loss Tips: బరువు తగ్గడం కోసం చపాతీలు తింటున్నారా.. రోజూ ఎన్ని తినాలంటే..?
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
ఇటీవల మమత న్యాయం కోసం గొంతెత్తారు. ముఖ్యమంత్రే స్వయంగా ర్యాలీలు, ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అత్యాచారానికి పాల్పడిన దోషులకు మరణశిక్ష విధించేలా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించేందుకు ఈ ప్రత్యేక సెషన్ను నిర్వహించనున్నారు. సమావేశాల్లో భాగంగా రెండోరోజు ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు స్పీకర్ బిమన్ బెనర్జీ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Assam: ముస్లిం వివాహాలు-విడాకుల చట్టాన్ని రద్దు చేసిన అస్సాం..
ఈ బిల్లు గురించి బుధవారం మమతా బెనర్జీ మాట్లాడారు. అత్యాచార ఘటనలను ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని మమత స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న చట్టాలను సవరించి, అత్యాచార నిందితులకు మరణ శిక్ష పడేలా అసెంబ్లీలో వచ్చేవారం బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించారు. ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపుతామని, దానికి ఆమోదం లభించకపోతే.. రాజ్భవన్ బయట నిరసన తెలుపుతామని హెచ్చరించారు. అత్యాచార నిందితులకు మరణ శిక్ష విధించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు శనివారం నుంచి రాష్ట్ర స్థాయిలో తృణమూల్ పార్టీ ఉద్యమం చేపడుతుందని ప్రకటించారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?