Bandi Sanjay : నేత కార్మికులు పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది
రాజన్న సిరిసిల్ల పట్టణంలో ఇటీవల మరణించిన ఊరగొండ రాజు కుటుంబాన్ని కేంద్ర హోoశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నేత కార్మికుల కరెంటు బిల్లుల విషయంలో గత ప్రభుత్వం, కొత్త ప్రభిత్వం మోసం చేసిందన్నారు. నేత కార్మికులకు రెండు పార్టీలు కలిసి 50 శాతం సబ్సిడీ ఇస్తామని మోసం చేశారని, ప్రభుత్వానికి మేము సలహాలు సూచనలు ఇస్తే మాపై నిందలు మోపుతున్నారన్నారు బండి సంజయ్. నేత కార్మికులు పరిస్థితి పెనం నుండి పోయిల పడ్డట్టు అయ్యిందని, నేత కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుతార్ని కి లెటర్ రాస్తామన్నారు బండి సంజయ్. N కన్వేషన్ కూల్చేసి తెలంగాణ ప్రజలకు సినీమా చూపిస్తున్నారని, హైడ్రా పై పూర్తి అవగాహన ప్రజలకు ఇవ్వాలన్నారు బండి సంజయ్. పెద్దోళ్ళని కొట్టి చిన్నోళ్ళకు ఇవ్వాలని, తెలిసి తెలియక కొందరు ఇల్లులు కట్టుకున్నారు వాటిని కూలిస్తే ఎలా అని ఆయన వ్యాఖ్యానించారు. జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరవేసి జైల్ పోయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు పౌరుశం ఎటుపోయిందని, స్కలం చెరువు ఎందుకు కూల్చడం లేదని, ఓవైసీ పై రేవంత్ రెడ్డి ద్వంద వైఖరి వ్యవహరిస్తున్నారన్నారు బండి సంజయ్.
Bengal assembly: కోల్కతా ఘటన నేపథ్యంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ
- Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
- Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
- New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
అంతేకాకుండా..’సల్కం చేరులో కట్టిన కాలేజి లో చదువుతున్న వారికి వేరే కాలేజీలో అడ్మిషమన్ ఇచ్చి అనుమతి లేని భవనాలు కూల్చాలి. ఓవైసీ మాపై చేయి వేస్తే అంతు చూస్తామని హెచ్చరించడంతో వెనక్కు తగ్గిన రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ 47 వెయిలా కోట్లు విడుదల చేస్తామని చెప్పి 17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసారు. రైతు రుణమాఫీ అనేది బోగస్. హైడ్రా పేరుతో ఆరు గ్యారంటీ లు పక్క దోవ పట్టిస్తున్నారు. సుప్రీం కోర్టు విషయంలో అందరూ జాగ్రత్తగా మాట్లాడాలి. కవిత కోసం మాట్లాడిన అడ్వకేట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిషేక్ సింన్గ్వి. బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సీటు కోసం ఎందుకు నామినేషన్ ఎందుకు వేయలేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అని ప్రజలకు తెలుసు. రేపు ఎల్లుండో యువరాజు కు అప్పగింతలు అమెరికాలో జరుగుతున్నాయి.’ అని బండి సంజయ్ అన్నారు.
తాజావార్తలు
-
Heinrich Klaasen: ఆటో ప్రయాణం, రెస్టారెంట్.. సాధారణ వ్యక్తిలా హైదరాబాద్ చుట్టేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ
-
Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
-
Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..
-
Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!