Bandi Sanjay : ఎన్నికలకు మేము సిద్దం మీరు సిద్దమా.. బండి సంజయ్ సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. అయితే.. మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించడంపై ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. అయితే.. టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలు కండకావరంతో అహంకారం తో మాట్లాడుతున్నారంటూ ఘాటుగా స్పందించారు. ఇచ్చిన హామీల గురుంచి చెప్పకుండా గర్వంతో మాట్లాడుతున్నారని, ఒకటి గెలవగానే ఎగిరెగిరి పడుతున్నారన్నారు. నీకు దమ్ముంటే 12 మంది ఎమ్మెల్యేలను రాజీనామ చేయించు అని ఆయన సవాల్ విసిరారు.
Also Read : Fight in Wedding: వివాహ వేడుకలో తలెత్తిన గొడవ.. నలుగురు మృతి
ఎన్నికలకు మేము సిద్దం మీరు సిద్దమా అని ఆయన అన్నారు. బీజేపీలో ఎమ్మేల్యే చేరాలి అంటే రాజీనామా చేసి రావాలి అని ఆయన వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బీజేపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు బండి సంజయ్. అయితే.. ప్రజా తీర్పును శిరసావహిస్తామన్న బండి సంజయ్.. ఓడినా… గెలిచినా… నిరంతరం ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తామన్నారు. దాడులు జరిగినా… గుండాలకు భయపడకుండా రాజగోపాల్ రెడ్డి కష్టపడి ఎన్నికల ప్రచారంలో పనిచేశారన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేశారని, లాఠీ ఛార్జ్ లు, బైండ్ ఓవర్ కేసులు, ఇలా ఎన్ని బెదిరింపులకు పాల్పడినా… కష్టపడి మా కార్యకర్తలు పనిచేశారు… వాళ్ళకి నా సెల్యూట్ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Trump-Iran: ఈ వారాంతంలో ఇరాన్పై భారీ దాడి జరగనుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
- CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- Toyota Fortuner: పెట్రోల్, డీజిల్కు గుడ్ బై.. 100% ఇథనాల్తో నడిచే కొత్త టొయోటా ఫార్చ్యూనర్ వచ్చేసిందోచ్..!
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
మా నేతలు అందరూ సమన్వయంతో పనిచేశారని, విమర్శలు, ప్రతివిమర్శలకు ఇది సమయం కాదని, ఒక్క ఉప ఎన్నిక ఫలితం తోనే టీఆర్ఎస్ వాళ్ళు అహంకారంతో కుక్కల్లా మొరుగుతున్నారంటూ ఆయన విమర్శించారు. ఎన్నికల హామీలను 15 రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు.. ఇచ్చిన సమయంలోపు ఎన్నికల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ నేతల అహంకారం చూసి, ఎందుకు టీఆర్ఎస్ను గెలిపించామా..? ఎందుకు తప్పు చేశామని మునుగోడు ప్రజలు భావిస్తున్నారన్నారు.
తాజావార్తలు
-
Trump-Iran: ఈ వారాంతంలో ఇరాన్పై భారీ దాడి జరగనుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
-
Janhvi Kapoor: ‘రాకా’లో జాన్వీ కపూర్ ఎంట్రీ?.. వైరల్ ఫొటోతో మొదలైన కొత్త రచ్చ!
-
CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
-
Secret Soldier : టైటిల్ మారింది.. ‘సీక్రెట్ సోల్జర్’గా వస్తున్న ‘చైనా పీస్’!
-
GST Collections July 2026: దేశ ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్.. జూలైలో GST వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!