Balka Suman : దొంగల ముఠా బ్యాచ్కి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవినీతికి పేటెంట్ కాంగ్రెస్ పార్టీ.. బ్లాక్ మెయిల్ కు పేటెంట్ రేవంత్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగల ముఠా బ్యాచ్కి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని, రాష్ట్ర రాజధానిలో సచివాలయం, అమరవీరుల స్మారక సౌధం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టడం కాంగ్రెస్, బీజేపీలకు మింగుడు పడటం లేదన్నారు. 2004లో సోనియా గాంధీ కరీంనగర్ లో తెలంగాణపై మాట మార్చిన విషయం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు.
Also Read : Upasana: బేబీ బంప్ తో ఉపాసన.. పుట్టబోయే బిడ్డ గురించి చరణ్ ఏమన్నాడంటే
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
అంతేకాకుండా.. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో 2004 నుండి 16 వరకు వెయ్యి మందికి పైగా ఆమరులవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా. కాంగ్రెస్ పార్టీ A to Z స్కాం గ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ హయాంలో ఏ వర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్ హయాంలో గాని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గాని రైతుబంధు రైతు భీమా లాంటి ఒక్క పథకం అమలు చేయడం లేదు. ఎవరి వెనుక ఎవరున్నారో తెలంగాణ ప్రజలు గమనించాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునే దమ్ము లేక మా పార్టీ నాయకులను టార్గెట్ చేశారు. కేసులతో భయపెట్టి మధురం చేయాలని కుట్ర చేస్తున్నారు. మోడీ తాటాకు చప్పుల్లకు భయపడేది లేదు.
Also Read : Special App: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగే ప్రశ్నలకు సత్వర సమాధానాలు
ఉద్యమ సమయంలో వందల కేసులు ఎదుర్కొని తెలంగాణను సాధించుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులది. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. అదానీ.. ప్రధాని బినామీ. కేసీఆర్ ని ఎదుర్కునే దమ్ము లేక కవితపై ఈడీ దాడులు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడాలి. బీజేపీ పార్టీకి కూల్చుడు పేల్చుడు తప్ప ఏమీ తెలియవు.తెలంగాణకి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష.’ అని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!