Balakrishna: రాబోయే ఎన్నికల్లో గెలుపు మనదే.. వైసీపీపై తీవ్ర విమర్శనాస్త్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరులో స్వర్ణాంధ్ర సాధికారయాత్రలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఫ్యాన్ మూడు రెక్కలు విరిగిపోతాయని దుయ్యబట్టారు. మాట తప్పను అంటూ జగన్ ఈ రాష్ట్రానికి మెడలు విరిచేసాడు.. దళితులకు అండగా ఉంటాను అని దళితులను హత్య చేస్తున్నావని సీఎం జగన్ పై మండిపడ్డారు. అక్క, చెల్లెమ్మలు అంటూ ఆస్తిలో హక్కులు అడుగుతున్నావు.. ఇసుక అమ్ముకొని ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నావని ప్రశ్నించారు. జే బ్రాండ్ పేరుతో అక్క చెల్లెమ్మల తాళిబొట్లు తెంపుతున్నావని వ్యాఖ్యానించారు.
PM Modi: రాహుల్ గాంధీ ‘‘రాజ మాంత్రికుడు’’.. పేదరికం వ్యాఖ్యలపై పీఎం మోడీ ఫైర్..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 25 పథకాలు రద్దు చేసిన దళిత ద్రోహి జగన్ అని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. అమరావతి రాజధాని గురించి ఉద్యమించిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారని మండిపడ్డారు. ఒక దళిత డ్రైవర్ ను.. ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని దుయ్యబట్టారు. నిరుద్యోగ యువతకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదని అన్నారు.
Varalakshmi Sarathkumar: నా మ్యారేజ్ అప్పుడే.. పెళ్లి తర్వాత కూడా.. వరలక్ష్మీ శరత్ కుమార్..?!
మైనారిటీ, బీసీ కార్పొరేషన్లు ప్రవేశపెడతాం.. ప్రతి పండుగకు నిరుపేదలకు తోపాలు అందించినది తెలుగుదేశం ప్రభుత్వం అని బాలకృష్ణ అన్నారు. రాయలసీమకు నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలం చేసింది చంద్రబాబు అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల నిధులను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు. రాజధాని లేని రాష్ట్రం చేశాడు జగన్ అని మండిపడ్డారు. రేపు జరగబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో ఇంటికి పంపించాలని కోరారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!