PM Modi: రాహుల్ గాంధీ ‘‘రాజ మాంత్రికుడు’’.. పేదరికం వ్యాఖ్యలపై పీఎం మోడీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మరోసారి ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. ఒకే స్ట్రోక్తో దేశంతో పేదరికాన్ని నిర్మూలిస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం స్పందించిన ప్రధాని మోడీ.. ఆయనను ‘‘రాజ మాంత్రికుడు’’ అని ఎద్దేవా చేశారు. దేశం రాహుల్ గాంధీని సీరియస్గా తీసుకోవడం లేదని అన్నారు. మధ్యప్రదేశ్ హోషంగాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పిపారియాలో ఆదివారం ప్రధాని మోడీ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రతిపక్ష ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. వారు దేశాన్ని రక్షించలేరని అన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని కాంగ్రెస్ ఎప్పుడూ అవమానించలేదని, కానీ బీజేపీ ప్రభుత్వం ఆయనను గౌరవించిందని మోడీ చెప్పారు. ‘‘ఒకే దెబ్బతో పేదరికాన్ని నిర్మూలిస్తానని కాంగ్రెస్ షెహజాదా చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ రాజమాంత్రికుడు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు..? అతని నానమ్మ(ఇందిరాగాంధీ) 50 ఏళ్ల క్రితం గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చారు’’ అని రాహుల్ గాంధీ పేరు చెప్పకుండా ప్రధాని మోదీ విమర్శించారు. 2014కి ముందు పదేళ్లు రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాన్ని నడిపించారని, ఇప్పుడు మాత్రం మంత్రదండం దొరికిందా..? అని ప్రశ్నించారు. సీపీఎం మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ, పార్టీ పేరు చెప్పకుండా ఇండియా కూటమిలోని ఓ పార్టీ అణు నిరాయుధీకరణకు పిలుపునిచ్చిందని అన్నారు. బలపడలేని పార్టీ దేశాన్ని బలోపేతం చేస్తుందా..? అని మోడీ ప్రశ్నించారు.
Also Read
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Natural Skin Care: నిమ్మ తొక్కతో హోం బ్యూటీ ట్రీట్మెంట్.. కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
Read Also: Varalakshmi Sarathkumar: నా మ్యారేజ్ అప్పుడే.. పెళ్లి తర్వాత కూడా.. వరలక్ష్మీ శరత్ కుమార్..?!
ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు తమ మేనిఫేస్టోలో ప్రమాదకరమైన హామీలను చేశాయని ఆరోపించారు. మనదేశాన్ని రక్షించుకోవడానికి అణ్వాయుధాలు ఉండాలి, లేకపోతే భారతదేశాన్ని రక్షించలేరు అని అన్నారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ పుకార్లను పుట్టిస్తోందని ఆయన మండిపడ్డారు. భారత రాజ్యాంగం వల్లే మోడీ ఈ స్థాయికి చేరుకున్నారని అన్నారు. ఆదివాసీలను కాంగ్రెస్ ఎప్పుడూ గుర్తించలేదని కానీ బీజేపీ ప్రభుత్వం వారిని గౌరవించిందని చెప్పారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఓ గిరిజన కుటుంబానికి చెందిన బిడ్డ దేశానికి రాష్ట్రపతి అయిందని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో ఎమర్జెన్సీ విధించిందని, రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టానుసారం రద్దు చేసిందని ప్రధాని అన్నారు. రామ మందిరాన్ని నిర్మిస్తే, కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేస్తే దేశం మంటల్లో కూరుకుపోతుందని గతంలో వారు ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజల ప్రేమ ఉందని చెప్పారు. దేశం ఏ వైపు ప్రయాణించాలో ఇండియా కూటమి నిర్ణయించుకోలేకపోతుందని విమర్శించారు.
తాజావార్తలు
-
Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
-
DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
-
Salman Khan: ‘మీరంతా ఎలా ఉన్నారు?’.. అనారోగ్య రూమర్లకు ఒక్క పోస్టుతో చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!