AP Assembly: నేడు స్పీకర్ ఎన్నికపై సభలో అధికారిక ప్రకటన.. దూరంగా వైసీపీ..!
- ఏపీ అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక
- ఈ రోజు శాసన సభలో బాధ్యతల స్వీకరణ
- ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరును ప్రకటించనున్న ప్రొటెం స్పీకర్
- గౌరవప్రదంగా స్పీకర్చైర్లో కుర్చొబెట్టనున్న సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కూటమి ఎమ్మెల్యేలు.. స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి దూరంగా వైసీపీ
AP Assembly: ఏపీ అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ఈ రోజు ఆయన శాసన సభలో బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఇవాళ రెండో రోజు ఉదయం పదిన్నరకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. నిన్న ప్రమాణం చేయని వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఇక, ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరును ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటిస్తారు.. ఆ తర్వాత స్పీకర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు అయ్యన్నపాత్రుడు. సభాపతి ఎన్నిక ప్రకటన తర్వాత.. అయ్యన్నను గౌరవప్రదంగా స్పీకర్చైర్లో కుర్చొబెట్టనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కూటమి ఎమ్మెల్యేలు.. అయితే, స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.. సభాపతిగా ఎన్నికైన వ్యక్తిని అధికార, విపక్ష నేతలు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అయితే వైసీపీ అధినేత జగన్ ఈ రోజు ఉదయం వ్యక్తిగత పర్యటన కోసం పులివెందులకు వెళ్లనున్నారు.
Read Also: Govinda Namalu: గోవింద నామాలు
Also Read
- IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..
- Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
- Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
- CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
మరోవైపు.. స్పీకర్ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు తొలి ప్రసంగం చేయనున్నారు.. సీఎం ప్రసంగాన్ని బలపరుస్తూ మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ప్రసంగాలు ఉండనున్నారు.. ఆ తర్వాత ప్రసంగాలకు సమాధానం ఇవ్వనున్నారు కొత్త స్పీకర్. ఇక, స్పీకర్ సమాధానం తర్వాత ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడనుంది.. కాగా, స్పీకర్గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక కోసం శుక్రవారం రోజు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరగగా.. టీడీపీ నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాత్రమే నామినేషన్ వేశారు. ఆయన తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు.. గడువులోగా మరో నామినేషన్ దాఖలు కాకపోవడంతో.. అయ్యన్నపాత్రుడు ఎన్నిక ఏకగ్రీవం అని అధికారులు ప్రకటించారు.
తాజావార్తలు
-
IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..
-
LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..
-
Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
-
KTR: రంగుల సినిమా చూపించి రేవంత్ అధికారంలోకి వచ్చాడు
-
Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్ప్లే + 7200mAh
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!