UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: ఉత్తరప్రదేశ్ శామ్లీ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆయుష్ మాలిక్ మత మార్పిడి వ్యవహారం మరో మలుపు తిరిగింది. యూపీ యాంటీ-కన్వర్షన్ చట్టం కింద పోలీసుల విచారణకు దారితీసిన ఈ కేసులో.. ఆయుష్ మాలిక్ తిరిగి హిందూ మతాన్ని స్వీకరించాడు. తన తల్లిదండ్రుల పడుతున్న బాధను చూసి, తన సొంత ఇష్టపూర్వకంగానే మళ్లీ సనాతన ధర్మానికి తిరిగి వచ్చినట్లు ఆయుష్ ప్రకటించాడు. హిందూ మతంలోకి తిరిగి వచ్చిన తర్వాత ఆయుష్ సాంప్రదాయబద్ధంగా పూజలు, ఆచారాలు నిర్వహిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఆయుష్ మాట్లాడుతూ.. “నేను గతంలో ఇస్లాం మతంలోకి మారి నా మతాన్ని మార్చుకున్నాను. కానీ నా తల్లిదండ్రుల బాధను చూసి, నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, నా స్వచ్ఛంద నిర్ణయంతోనే మళ్లీ హిందూ మతంలోకి తిరిగి వచ్చాను. ఇకపై నా కుటుంబ రక్షణలోనే, వారితో పాటే జీవించాలనుకుంటున్నాను” అని స్పష్టం చేశాడు. ఆయుష్ తండ్రి దేవరాజ్ మాలిక్ కూడా తన కుమారుడు అధికారికంగా తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు ధృవీకరించారు.
అసలు ఏం జరిగింది?
బీ-ఫార్మా పూర్తి చేసి, తన కుటుంబానికి చెందిన మెడికల్ స్టోర్ను చూసుకునే ఆయుష్ మాలిక్కు 2018లో కాలి గాయానికి చికిత్స తీసుకుంటున్న సమయంలో చాందిని ఖురేషి అనే ఫిజియోథెరపిస్ట్తో పరిచయమైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో చాందిని, ఆమె తండ్రి ఇస్లాం ఖురేషి కలిసి ఆయుష్ను క్రమంగా ఇస్లాం వైపు ఆకర్షించేలా మైండ్ వాష్ చేశారు. ఆ తర్వాత 2023లో ఆయుష్ను ఢిల్లీకి తీసుకెళ్లి, అక్కడ ముస్లిం మతంలోకి మార్చి ‘మొహమ్మద్ అలీ’గా పేరు మార్చారు. అక్కడ నికా (పెళ్లి) కూడా జరిపించినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ, దానికి సంబంధించిన ఎలాంటి వివాహ ధృవీకరణ పత్రాలు పోలీసుల విచారణలో లభించలేదు. మత మార్పిడి తర్వాత ఆయుష్ గడ్డం పెంచడం, రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయడం, ముస్లిం సాంప్రదాయ దుస్తులు ధరించడం వంటివి చేయడం ప్రారంభించాడు.
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
అయితే, తమ కుటుంబానికి ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆస్తులను హస్తగతం చేసుకోవాలనే పక్కా ప్లాన్, కుట్రతోనే చాందిని కుటుంబం తన కొడుకును బ్రెయిన్ వాష్ చేసి మతం మార్చిందని ఆయుష్ తండ్రి దేవరాజ్ మాలిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా యూపీ పోలీసులు భారతీయ న్యాయ సంహిత’ (BNS), ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొన్ని వారాల క్రితమే ఫిజియోథెరపిస్ట్ చాందిని ఖురేషిని, ఆమె తండ్రి ఇస్లాం ఖురేషిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయుష్ మళ్లీ తన స్వగృహానికి చేరి హిందూ మతంలోకి మారడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
-
OTR : నిజామాబాద్ గులాబీ కోటలో గందరగోళం.. నేతల తీరు చర్చనీయాంశం!
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!