WTC Final 2023: మూడోరోజు 300 ఆధిక్యానికి చేరువలో ఆసీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023 మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 123 పరుగుల స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్లో దక్కిన 173 పరుగుల ఆధిక్యంతో కలిపి ఆసీస్ ప్రస్తుతం 296 పరుగుల తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన ఆస్ట్రేలియా ఓపెనర్లను త్వరగా ఔట్ చేశారు. 8 బంతుల్లో 1 పరుగు చేసిన డేవిడ్ వార్నర్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో వికెట్ కీపర్ శ్రీకర్ భరత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 39 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా, ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో డగౌట్ కి పంపించాడు.
Read Also : Bihar : డేటింగ్ యాప్ తో వల.. యువకులే కిలేడి టార్గెట్..
Also Read
ఉమేశ్ యాదవ్కి ఈ మ్యాచ్లో ఇదే తొలి వికెట్.. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ కలిసి మూడో వికెట్కి 62 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 47 బంతుల్లో 3 ఫోర్లతో 34 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ రవీంద్ర జడేజా బౌలింగ్లో శార్దూల్ ఠాకూర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. 27 బంతుల్లో 2 సిక్సర్లతో 18 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఇద్దరూ రెండో ఇన్నింగ్స్లో జడ్డూ బౌలింగ్లోనే అవుట్ కావడం విశేషం..
Read Also : Sreemukhi : అందం కోసం శ్రీముఖి ఇలాంటి పనులు చేస్తుందా?
111 పరుగుల వద్ద ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. మార్నస్ లబుషేన్ 118 బంతుల్లో 4 ఫోర్లతో 41 పరుగులు, కామెరూన్ గ్రీన్ 27 బంతుల్లో ఓ ఫోర్తో 7 పరుగులు చేసి ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరినీ నాలుగో రోజు త్వరగా అవుట్ చేసినా ఆ తర్వాత అలెక్స్ క్యారీ, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ కూడా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా ఈజీగా రెండో ఇన్నింగ్స్లో టీమిండియాకి 400 పరుగుల టార్గెట్ పెట్టేలా కనబడుతుంది. అదే జరిగితే టీమిండియా బ్యాటర్లపై కొండంత భారం పెట్టినట్లు అవుతుంది.
Read Also : Ram Charan: అటు తమ్ముడును.. ఇటు ఫ్రెండ్ ను సంతోషపెట్టిన చరణ్
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 151/5 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, 296 పరుగులకి ఆలౌట్ అయ్యింది. శ్రీకర్ భరత్, మొదటి సెషన్ రెండో బంతికే అవుట్ అయ్యాడు. అయితే అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ కలిసి ఏడో వికెట్కి 109 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాని ఆదుకున్నారు.. అయితే వీరిద్దరి భాగస్వామ్యం కారణంగా మూడో రోజు మొదటి సెషన్లో ఒక్క వికెట్ కోల్పోయి 107 పరుగులు చేసిన టీమిండియా పూర్తి డామినేషన్ కనబర్చింది. అయితే 89 పరుగులు చేసి సెంచరీ వైపు సాగుతున్న అజింకా రహానే, లంచ్ బ్రేక్ తర్వాత అవుట్ అయ్యాడు. ఆ వెంటనే ఉమేశ్ యాదవ్ వికెట్ కూడా భారత జట్టు కోల్పోయింది.
Read Also : Renault Cars: కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఆ కంపెనీ కార్లపై భారీ ఆఫర్..!
ఇక 51 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్, ఓవల్లో వరుసగా మూడో 50+ స్కోరు నమోదు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. శార్దూల్ ఠాకూర్ అవుటైన వెంటనే మహ్మద్ షమీ కూడా పెవిలియన్ చేరడంతో 300 మార్కుకి 4 పరుగుల దూరంలో టీమిండియా నిలిచిపోయింది. తొలి ఇన్నింగ్స్లో 469 పరుగులు చేసిన ఆస్ట్రేలియాకి 173 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!