Virat Kohli: విరాట్ కోహ్లీకి ఇదే చివరి సిరీస్.. టీమిండియా మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
- పెర్త్ వేదికగా మొదటి టెస్టు
- కోహ్లీకి మద్దతుగా దాదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత మూడేళ్లుగా టెస్టు క్రికెట్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అడపదడపా ఇన్నింగ్స్లు తప్పితే పెద్దగా మెరుపులు ఏమీ లేవు. ఈ ఏడాదిలో ఆడిన 12 టెస్టుల్లో 250 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. విరాట్ పేలవ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అతడికి మద్దతుగా నిలిచారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో తిరిగి ఫామ్లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కింగ్ తన కెరీర్లో ఆస్ట్రేలియా గడ్డపై ఆడే చివరి టెస్టు సిరీస్ కూడా ఇదే అయ్యే అవకాశం ఉందని దాదా అభిప్రాయపడ్డారు.
ఓ క్రీడా ఛానల్తో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ ఒక ఛాంపియన్ ఆటగాడు. అతని వన్డే గణాంకాలు ఇప్పటికీ మెరుగ్గా ఉన్నాయి. గతంలో విరాట్ ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు క్రికెట్లో మంచి విజయాలు సాధించాడు. 2014లో నాలుగు సెంచరీలు చేశాడు. 2018లో ఒక సెంచరీ బాదాడు. ఆస్ట్రేలియాలో అతని రికార్డులు బాగున్నాయి. ఆస్ట్రేలియాలో 6 టెస్టు సెంచరీలు చేశాడు. ఇది మాములు విషయం కాదు. 28, 29, 30 సంవత్సరాల వయస్సులో గేమ్ భిన్నంగా ఉంటుంది. 36, 37 సంవత్సరాల వయస్సులో మరోలా ఉంటుంది. ఆసీస్ గడ్డపై ఎలా ఆడాలో కోహ్లీకి తెలుసు’ అని చెప్పారు.
Also Read
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
- Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
Also Read: Vivo Y18t Price: ముందస్తు సమాచారం లేకుండా.. 10 వేలలో అద్భుతమైన ఫోన్ను లాంచ్ చేసిన ‘వివో’!
‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని విరాట్ కోహ్లీ సీరియస్గా తీసుకుంటాడు. విరాట్ రాణిస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆస్ట్రేలియాలో వికెట్ వేగంగా ఉంటుంది. పిచ్పై పేస్, బౌన్స్ ఉంటుంది. కూకబుర్రా బంతితో సీమ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది అతనికి మంచి సిరీస్ అవుతుంది. టెస్టు క్రికెట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించడం కెరీర్లో ఇదే చివరిసారని అతడికి తెలుసు. కాబట్టి ఈ సిరీస్ కోహ్లీకి ఎంతో ప్రతిష్ఠాత్మకం అవుతుంది’ అని దాదా చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాలో 13 టెస్టుల్లో 54.08 సగటుతో 1,352 పరుగులు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 24 టెస్ట్ మ్యాచ్ల్లో 42 ఇన్నింగ్స్లలో 48.26 సగటుతో 1979 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
-
Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
-
Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!