AUS vs IND: అశ్విన్ నాకు గురువు.. ఎన్నో విషయాలు నేర్పాడు: ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్
- నవంబర్ 22న పెర్త్ వేదికగా తొలి టెస్టు ఆరంభం
- వికెట్ల వేటలో అశ్విన్-లైయన్, 500 టెస్ట్ వికెట్ల మైలురాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ 22న పెర్త్ వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్ల సన్నద్ధమవుతున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు వెళ్లాలంటే.. ఈ సిరీస్ ఆస్ట్రేలియా, భారత్లకు అత్యంత కీలకం. కాబట్టి విజయం కోసమే ప్లేయర్స్ బరిలోకి దిగుతున్నారు. పేస్ పిచ్లపై స్పిన్నర్లు కూడా రాణించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లైయన్ వికెట్ల వేట కోసం సిద్ధంగా ఉన్నారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా నాథన్ లైయన్ స్పందించాడు. ఆర్ అశ్విన్ తనకు గురువు అని, యాష్ స్పిన్ టెక్నిక్స్ను చూసి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. ఫాక్స్ క్రికెట్తో లైయన్ మాట్లాడుతూ… ‘ఆర్ అశ్విన్ అద్భుతమైన బౌలర్. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గణాంకాలే చెబుతాయి యాష్ బౌలింగ్ గురించి. నా కెరీర్ మొత్తంలో ఎక్కువగా అశ్విన్తోనే తలపడ్డా. ఇంకా తలపడుతూనే ఉన్నా. యాష్ నుంచి చాలా విషయాలను నేర్చుకున్నా. పరిస్థితులకు త్వరగా ఎలా అలవాటుపడాలనేది అతడిని చూసే తెలుసుకున్నా’ అని చెప్పాడు.
Also Read
- Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
- Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
- Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
- 1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీకి ఇదే చివరి సిరీస్.. టీమిండియా మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
‘ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో అశ్విన్ ఒకడు. తెలివైన బౌలర్ మాత్రమే కాదు.. ఏ విషయాన్ని అయినా చాలా త్వరగా నేర్చుకోగలడు. ఓ గురువుగా నాకు చాలా విషయాలు చెప్పాడు. అతడి బౌలింగ్ ఫుటేజీలను ఎప్పుడూ చూస్తూ ఉండేవాడిని. భారత్లో ఎలా బౌలింగ్ చేస్తాడు, ఆస్ట్రేలియాలో ఎలా బంతులు విసురుతాడు అని గమనిస్తా. మరోసారి ఆస్ట్రేలియా, భారత్ మధ్య సిరీస్ రసవత్తరంగా ఉంటుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు వెళ్లాలంటే ఈ సిరీస్ కీలకం. బాగా రాణించేందుకు ప్రయత్నిస్తా’ అని నాథన్ లైయన్ చెప్పుకొచ్చాడు. 2011/12 సిరీస్లో యాష్, లైయన్ పోటీ ఆరంభమైంది. ఇద్దరు స్పిన్నర్లు వారి కెరీర్లో ముఖ్యమైన మైలురాళ్లను సాధించారు. ఇద్దరు 500 టెస్ట్ వికెట్ల మైలురాయిని అందుకున్నారు.
తాజావార్తలు
-
Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
-
Rs1 Lakh Credit: ప్రభుత్వం కొత్త పథకం.. కోటి మంది మహిళలకు రూ.1 లక్ష..!
-
Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
-
The Paradise Tickets: ‘ది ప్యారడైజ్’కు భారీ క్రేజ్.. అప్పుడే 5 వేలకు పైగా టికెట్లు సోల్డ్!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
ట్రెండింగ్
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!