Bangladesh: మరీ ఇంత దారుణమా? ఆలయాలపై దాడులు.. హిందువులను ఊచకోత కోస్తున్నారు!(వీడియోలు)
- బంగ్లాదేశ్లో నానాటికి దిగజారుతున్న హిందువుల పరిస్థితి
- ఇటీవల హిందూ నాయకుడు చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్
- నిరసన వ్యక్తం చేసిన హిందువులపై పెద్ద ఎత్తున దాడులు
- ఇంకా చల్లారని అగ్ని జ్వాలలు
- తాజాగా చిట్టగాంగ్లో దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి నానాటికి దిగజారుతోంది. ఇటీవల హిందూ నాయకుడు చిన్మోయ్ కృష్ణదాస్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆ దేశ జాతీయ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కృష్ణదాస్కు బెయిల్ కూడా నిరాకరించారు. ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు ను వెంటనే విడుదల చేయాలని హిందూ సంఘాలు, ప్రజానికం నిరసనలు చేపట్టారు. వారిపై స్థానిక ముస్లింలు విచ్చలవిడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రధాని మోడీని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కలిశారు. పొరుగుదేశంలోని పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు.
READ MORE: Rishiteswari Case: సంచలనం సృష్టించిన కేసు కొట్టివేత.. మరణమే శరణ్యం అంటున్న పేరెంట్స్..
Also Read
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
కాగా.. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కొంత మంది ముస్లింలు హిందువుల ఇళ్లను బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆలయాలపై దాడులు చేస్తూ.. హిందువులను చితక్కొడుతున్నట్లు చూడొచ్చు. ఈ ఘటన చిట్టగాంగ్లో జరిగినట్లు తెలిసింది. శుక్రవారం జుమ్మా ప్రార్థనల అనంతరం స్థానికంగా ఉన్న శాంతనేశ్వరి ఆలయంపై దాడి చేశారు. అంతే కాకుండా సమీపంలోని హిందువుల దుకాణాలు, ఇళ్లపై రాళ్లు రువ్వుతూ.. దాడులు చేశారు. ఈ దాడిలో చాలా మంది హిందువులకు గాయాలైనట్లు సమాచారం. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు వారిని పాపుతున్నా.. లెక్కచేయకుండా దాడులకు పాల్పడుతున్నారు. దీంతో హిందు ప్రజానికం బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం లేదు. వ్యాపారస్థులు, రోజువారీ కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది.
READ MORE:Congress: కాంగ్రెస్లో ‘‘మహా’’ ఓటమి నిరాశ.. కుట్ర దాగి ఉందని ఈసీకి ఫిర్యాదు..
ఈ వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్లో పోస్ట్ చేశారు. “బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్లో శుక్రవారం జుమ్మా ప్రార్థనల అనంతరం శాంతనేశ్వరి ఆలయంపై రాడికల్స్ దాడి చేశారు. హిందువుల దుకాణాలు, ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. పలువురికి గాయాలైనట్లు సమాచారం!” అని క్యాప్షన్లో రాసుకొచ్చారు. భారత్ త్వరగా స్పందించి ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాలని కోరుతున్నారు.
Urgent 🚨 Alert
In Bangladesh's Chittagong, Radicals have attacked the Shantaneswari Temple after Friday Jumma prayers.
Reports claiming Hindu shops and houses being attacked. Many Injured!! pic.twitter.com/zOS0iWMcHD
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 29, 2024
తాజావార్తలు
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
-
Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
-
Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
-
NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!