Rishiteswari Case: సంచలనం సృష్టించిన కేసు కొట్టివేత.. మరణమే శరణ్యం అంటున్న పేరెంట్స్..
- తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి కేసు..
- తుది తీర్పు వెలువరించిన గుంటూరు జిల్లా కోర్టు..
- సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసు కొట్టేస్తున్నామని తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishiteswari Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి కేసును కొట్టివేసింది గుంటూరు కోర్టు.. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా, రిషితేశ్వరి కేసు కొట్టేస్తున్నామని తుది తీర్పు వెలువరించింది గుంటూరు జిల్లా ఐదవ కోర్టు.. నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో తీవ్ర కలకలం సృష్టించిన విషయం విదితమే.. అయితే, 2015 జులై 14వ తేదీన నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు ర్యాగింగే కారణమని సూసైడ్ నోట్ రాసింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని లేఖలో పేర్కొంది.. ఈ ఘటనపై అప్పట్లో సంచలనం సృష్టించింది.. బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులతో పాటు.. విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఇలా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించగా.. నేడు గుంటూరు జిల్లా 5వ కోర్టు తుది తీర్పు వెలువరిచింది..
Read Also: Sivakarthikeyan : ఆర్మీ నుంచి అరుదైన అవార్డు అందుకున్న హీరో శివ కార్తికేయన్
Also Read
అయితే, గుంటూరు కోర్టు తీర్పుపై రిషితేశ్వ రి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఈ కేసులో 170 మంది సాక్షులు ఉన్నారు.. మా అమ్మాయి రాసిన లెటర్ కూడా, ప్రతి అధికారికి అందించాం… వాటిని ఎందుకు ఈ కేసులో పరిగణనకు తీసుకోలేదో.. అర్థం కావడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.. మా బిడ్డ విషయంలో న్యాయం జరిగేందుకు, అవసరమైతే ముఖ్యమంత్రిని , ఉప ముఖ్యమంత్రిని కలుస్తాం అన్నారు.. మాకు పై కోర్టులకు వెళ్లి పోరాడే ఆర్థిక శక్తి లేదు.. ప్రభుత్వమే మా అమ్మాయి కేసు విషయంలో సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.. మా అమ్మాయి విషయంలో న్యాయం జరగకపోతే, మాకు మరణమే శరణ్యం అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రిషితేశ్వ రి తల్లిదండ్రులు..
తాజావార్తలు
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!