Rishiteswari Case: సంచలనం సృష్టించిన కేసు కొట్టివేత.. మరణమే శరణ్యం అంటున్న పేరెంట్స్..
- తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి కేసు..
- తుది తీర్పు వెలువరించిన గుంటూరు జిల్లా కోర్టు..
- సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసు కొట్టేస్తున్నామని తీర్పు..
Rishiteswari Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి కేసును కొట్టివేసింది గుంటూరు కోర్టు.. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా, రిషితేశ్వరి కేసు కొట్టేస్తున్నామని తుది తీర్పు వెలువరించింది గుంటూరు జిల్లా ఐదవ కోర్టు.. నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో తీవ్ర కలకలం సృష్టించిన విషయం విదితమే.. అయితే, 2015 జులై 14వ తేదీన నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు ర్యాగింగే కారణమని సూసైడ్ నోట్ రాసింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని లేఖలో పేర్కొంది.. ఈ ఘటనపై అప్పట్లో సంచలనం సృష్టించింది.. బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులతో పాటు.. విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఇలా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించగా.. నేడు గుంటూరు జిల్లా 5వ కోర్టు తుది తీర్పు వెలువరిచింది..
Read Also: Sivakarthikeyan : ఆర్మీ నుంచి అరుదైన అవార్డు అందుకున్న హీరో శివ కార్తికేయన్
Also Read
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
- Vegetable Market: మరోసారి తెరపైకి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం
అయితే, గుంటూరు కోర్టు తీర్పుపై రిషితేశ్వ రి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఈ కేసులో 170 మంది సాక్షులు ఉన్నారు.. మా అమ్మాయి రాసిన లెటర్ కూడా, ప్రతి అధికారికి అందించాం… వాటిని ఎందుకు ఈ కేసులో పరిగణనకు తీసుకోలేదో.. అర్థం కావడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.. మా బిడ్డ విషయంలో న్యాయం జరిగేందుకు, అవసరమైతే ముఖ్యమంత్రిని , ఉప ముఖ్యమంత్రిని కలుస్తాం అన్నారు.. మాకు పై కోర్టులకు వెళ్లి పోరాడే ఆర్థిక శక్తి లేదు.. ప్రభుత్వమే మా అమ్మాయి కేసు విషయంలో సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.. మా అమ్మాయి విషయంలో న్యాయం జరగకపోతే, మాకు మరణమే శరణ్యం అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రిషితేశ్వ రి తల్లిదండ్రులు..
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?