Rishiteswari Case: సంచలనం సృష్టించిన కేసు కొట్టివేత.. మరణమే శరణ్యం అంటున్న పేరెంట్స్..
- తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి కేసు..
- తుది తీర్పు వెలువరించిన గుంటూరు జిల్లా కోర్టు..
- సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసు కొట్టేస్తున్నామని తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishiteswari Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి కేసును కొట్టివేసింది గుంటూరు కోర్టు.. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా, రిషితేశ్వరి కేసు కొట్టేస్తున్నామని తుది తీర్పు వెలువరించింది గుంటూరు జిల్లా ఐదవ కోర్టు.. నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో తీవ్ర కలకలం సృష్టించిన విషయం విదితమే.. అయితే, 2015 జులై 14వ తేదీన నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు ర్యాగింగే కారణమని సూసైడ్ నోట్ రాసింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని లేఖలో పేర్కొంది.. ఈ ఘటనపై అప్పట్లో సంచలనం సృష్టించింది.. బాధితురాలి కుటుంబసభ్యులు, బంధువులతో పాటు.. విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఇలా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించగా.. నేడు గుంటూరు జిల్లా 5వ కోర్టు తుది తీర్పు వెలువరిచింది..
Read Also: Sivakarthikeyan : ఆర్మీ నుంచి అరుదైన అవార్డు అందుకున్న హీరో శివ కార్తికేయన్
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
అయితే, గుంటూరు కోర్టు తీర్పుపై రిషితేశ్వ రి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఈ కేసులో 170 మంది సాక్షులు ఉన్నారు.. మా అమ్మాయి రాసిన లెటర్ కూడా, ప్రతి అధికారికి అందించాం… వాటిని ఎందుకు ఈ కేసులో పరిగణనకు తీసుకోలేదో.. అర్థం కావడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.. మా బిడ్డ విషయంలో న్యాయం జరిగేందుకు, అవసరమైతే ముఖ్యమంత్రిని , ఉప ముఖ్యమంత్రిని కలుస్తాం అన్నారు.. మాకు పై కోర్టులకు వెళ్లి పోరాడే ఆర్థిక శక్తి లేదు.. ప్రభుత్వమే మా అమ్మాయి కేసు విషయంలో సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.. మా అమ్మాయి విషయంలో న్యాయం జరగకపోతే, మాకు మరణమే శరణ్యం అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రిషితేశ్వ రి తల్లిదండ్రులు..
తాజావార్తలు
-
US Iran Sanctions: ఇరాన్తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!