Congress: కాంగ్రెస్లో ‘‘మహా’’ ఓటమి నిరాశ.. కుట్ర దాగి ఉందని ఈసీకి ఫిర్యాదు..
- మహారాష్ట్ర ఓటమిపై కాంగ్రెస్లో తీవ్ర నిరాశ..
- ఎన్నికల ఫలితాలపై ఈసీకి ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: వరసగా ఓటములు కాంగ్రెస్ పార్టీలో నిరాశను పెంచుతున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా దక్కించుకున్న తర్వాత జోష్ మీద ఉన్న హస్తం పార్టీకి హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్కి గురిచేశాయి. మహారాష్ట్రలో అయితే, అత్యంత దారుణమైన రీతిలో ఓడిపోయింది. ఇదిలా ఉంటే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్(ఈవీఎం)లు హ్యాక్ అయ్యాయంటూ పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఏకంగా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు చేసింది. వీటిపై సమగ్ర విచారణ జరగాలని ఈసీని కోరింది. ఈసీకి సమర్పించిన పిటిషన్ లో ‘‘ ఓటర్ రికార్డుల్ని ఏకపక్షంగా చేర్చడం/తొలగించడం’’ కారణంగా జూలై 2024-నవంబర్ 2024 మధ్య కాలంలో 47 లక్షల మంది ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చారని కాంగ్రెస్ పేర్కొంది. సగటున 50,000 మంది ఓటర్లు పెరిగిన 50 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 47 స్థానాల్లో గెలుపొందినట్లు చెప్పింది.
Also Read
- CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
Read Also: India On Bangladesh: ‘‘ఉగ్రవాద మాటలు పెరుగుతున్నాయి.’’ బంగ్లాదేశ్పై భారత్ కీలక వ్యాఖ్యలు..
తుల్జాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. అక్రమ ఓట్లు వేయడానికి నకిలీ ఆధార్ కార్డులు, వేర్వేరు ఫోటోలు, పేర్లతో వ్యక్తల్ని సృష్టించారిన ఆరోపించింది. తుల్జాపూర్ నియోజకవర్గంలో 1999-2014 వరకు కాంగ్రెస్కి చెందిన మధుకరర్ రావు చవాన్ గెలుపొందుతూ వస్తున్నాడు. ఈ సారి అక్కడ నుంచి బీజేపీకి చెందిన రణజగ్జిత్ సిన్హా పాటిల్ 37,000 ఓట్లతో గెలిచారు. బీజేపీ ఈ స్థానంలో గెలవడం ఇదే తొలిసారి.
ఓటింగ్ డేటాలో వ్యత్యాసాలను కూడా కాంగ్రెస్ హైలెట్ చేసింది. సాయంత్రం 5 గంటలకు ఈసీ సగటు ఓటింగ్ శాతం 58.22 శాతంగా ఉంది. రాత్రి 11.30 వరకు 65.02శాతానికి పెరిగింది. చివరకు 66.05 శాతంగా నమోదంది. పోలింగ్ ముగిసిన గంటలో 70 లక్షలకు పైగా ఓట్లు పోలవడం నమ్మశక్యంగా లేదని, చరిత్రలో ఎన్నడూ జరగలేదని కాంగ్రెస్ వాదించింది.
తాజావార్తలు
-
Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
-
Takshaka : వశిష్ట తమ్ముడి డైరెక్షన్లో ‘తక్షక’
-
BSNL: బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్.. రూ. 51కే రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్
-
Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
-
CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!