Congress: కాంగ్రెస్లో ‘‘మహా’’ ఓటమి నిరాశ.. కుట్ర దాగి ఉందని ఈసీకి ఫిర్యాదు..
- మహారాష్ట్ర ఓటమిపై కాంగ్రెస్లో తీవ్ర నిరాశ..
- ఎన్నికల ఫలితాలపై ఈసీకి ఫిర్యాదు..
Congress: వరసగా ఓటములు కాంగ్రెస్ పార్టీలో నిరాశను పెంచుతున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా దక్కించుకున్న తర్వాత జోష్ మీద ఉన్న హస్తం పార్టీకి హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్కి గురిచేశాయి. మహారాష్ట్రలో అయితే, అత్యంత దారుణమైన రీతిలో ఓడిపోయింది. ఇదిలా ఉంటే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్(ఈవీఎం)లు హ్యాక్ అయ్యాయంటూ పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఏకంగా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు చేసింది. వీటిపై సమగ్ర విచారణ జరగాలని ఈసీని కోరింది. ఈసీకి సమర్పించిన పిటిషన్ లో ‘‘ ఓటర్ రికార్డుల్ని ఏకపక్షంగా చేర్చడం/తొలగించడం’’ కారణంగా జూలై 2024-నవంబర్ 2024 మధ్య కాలంలో 47 లక్షల మంది ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చారని కాంగ్రెస్ పేర్కొంది. సగటున 50,000 మంది ఓటర్లు పెరిగిన 50 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 47 స్థానాల్లో గెలుపొందినట్లు చెప్పింది.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
Read Also: India On Bangladesh: ‘‘ఉగ్రవాద మాటలు పెరుగుతున్నాయి.’’ బంగ్లాదేశ్పై భారత్ కీలక వ్యాఖ్యలు..
తుల్జాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. అక్రమ ఓట్లు వేయడానికి నకిలీ ఆధార్ కార్డులు, వేర్వేరు ఫోటోలు, పేర్లతో వ్యక్తల్ని సృష్టించారిన ఆరోపించింది. తుల్జాపూర్ నియోజకవర్గంలో 1999-2014 వరకు కాంగ్రెస్కి చెందిన మధుకరర్ రావు చవాన్ గెలుపొందుతూ వస్తున్నాడు. ఈ సారి అక్కడ నుంచి బీజేపీకి చెందిన రణజగ్జిత్ సిన్హా పాటిల్ 37,000 ఓట్లతో గెలిచారు. బీజేపీ ఈ స్థానంలో గెలవడం ఇదే తొలిసారి.
ఓటింగ్ డేటాలో వ్యత్యాసాలను కూడా కాంగ్రెస్ హైలెట్ చేసింది. సాయంత్రం 5 గంటలకు ఈసీ సగటు ఓటింగ్ శాతం 58.22 శాతంగా ఉంది. రాత్రి 11.30 వరకు 65.02శాతానికి పెరిగింది. చివరకు 66.05 శాతంగా నమోదంది. పోలింగ్ ముగిసిన గంటలో 70 లక్షలకు పైగా ఓట్లు పోలవడం నమ్మశక్యంగా లేదని, చరిత్రలో ఎన్నడూ జరగలేదని కాంగ్రెస్ వాదించింది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!