Physical Harassment: ఆగ్రాలో దారుణం.. హోటల్లో పనిచేసే మహిళపై సామూహిక అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical Harassment: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ హోటల్లో పనిచేసే మహిళ ఉద్యోగిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్థరాత్రి ఆ మహిళ నుంచి తమకు కాల్ వచ్చిందని, వెంటనే సంఘటన స్థలానిక చేరుకుని బాధిత మహిళను కాపాడినట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read Also: West Bengal: టీఎంసీ నాయకుడు దారుణ హత్య.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత
Also Read
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది.. తాగిన మైకంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపింది. అంతేకాకుండా.. తనను బలవంతంగా గదిలో బంధించి దారుణంగా కొట్టారని మహిళ పోలీసులకు తెలిపింది. నిందితులు బలవంతంగా మద్యం తాగించారని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఓ మహిళ సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఆగ్రా పోలీసులు తెలిపారు. బాధితురాలు హోటల్ లో పనిచేసే ఉద్యోగి అని పోలీసులు చెప్పారు. ఘటనకు పాల్పడిన సమయంలో బాధితురాలిపై కొంతమంది వ్యక్తులు దాడి చేసినట్లు ఓ వీడియో కూడా బయటపడింది.
Read Also: Virat Kohli: నెదర్లాండ్స్ క్రికెటర్కు కోహ్లీ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
మరోవైపు బాధితురాలిని వైద్య పరీక్షలు నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అర్చన సింగ్ తెలిపారు.
తాజావార్తలు
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!