Atchannaidu : వైసీపీ నేతలు పిచ్చిగా వాగుతున్నారు తప్ప వాస్తవాలు తెలుసుకోవడంలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషనుకు సంబంధించిన పూర్తి వాస్తవాల ప్రతిరూపమే ఈ పుస్తకమని, త్వరలోనే ఫైబర్ నెట్ ప్రాజెక్ట్.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారాలను కూడా పూర్తివాస్తవాలతో పుస్తక రూపంలో ప్రజల ముందు ఉంచుతామన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రూ.3,300 కోట్ల అవినీతి అని విషప్రచారం చేసి, చివరకు రూ.27కోట్ల పార్టీ ఫండ్ ను అవినీతి సొమ్ముగా భూతద్దంలో చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాల్ని అవినీతి సొమ్ముగా చూపడం ఈ ముఖ్యమంత్రి, అతని మోచేతి నీళ్లుతాగే వ్యవస్థల మతిలేనితనానికి నిదర్శనమని ఆయన అవ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి ప్రజలు, కార్యకర్తలు ఇచ్చిన నిధులకు.. జగన్ సర్కార్ చెబుతున్న అవినీతికి సంబంధమేంటి? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : LEO : ప్రభాస్ సలార్ రికార్డు క్రాస్ చేసిన లియో..
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
అంతేకాకుండా..’అసలు అవినీతి సొమ్ము అంటే జగన్ రెడ్డి ఖాతాలకో.. అతని కంపెనీలకో.. అతని భార్య ఖాతాకో వచ్చినట్టు వచ్చే సొమ్ము. చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపి 28 రోజులవుతున్నా.. ఈ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు బయట పెట్టలేక చివరకు పార్టీకి వచ్చిన నిధులపై పడింది. ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నేతలు పిచ్చివాగుడు వాగుతున్నారు తప్ప వాస్తవాలు తెలుసుకోవడంలేదు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ రేపు టీడీపీ ఆధ్వర్యంలో “గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం” కార్యక్రమం. రేపు రాత్రి 7 గం.లకు ఇళ్లలో లైట్లు ఆర్పి 5 నిమిషాల పాటు నిరనస తెలపాలి. ఇళ్లలో లైట్లు ఆర్పి, ఇంటి బయట సెల్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించి 5 నిమిషాల పాటు నిరసన చేయాలి. రోడ్డుపై ద్విచక్ర వాహనాలు, కార్లలో ఉంటే వాహన హెడ్ లైట్లు ఆన్, ఆఫ్ చేస్తూ నిరసన తెలపాలి. గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా భారత కాలమానం ప్రకారం నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి.’ అని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
Also Read : iPhone 14 Price Drop: అతి తక్కువ ధరకే ఐఫోన్ 14.. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు!
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!